పరిగిలో రోడ్డు ప్రమాదం: ఒకరి దుర్మరణం

పరిగిలో రోడ్డు ప్రమాదం: ఒకరి దుర్మరణం

(లోకల్ గైడ్) పరిగి: పరిగి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌ను డీసీఎం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
పోలీసుల వివరాల ప్రకారం, ఈరోజు మధ్యాహ్నం పరిగి ప్రభుత్వ ఆసుపత్రి ముందు నవాబుపేట్ మండలం కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరిగూడెం శ్రీనివాస్ (35) తన బైక్‌పై వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే మృతి చెందాడు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, డీసీఎంను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags:

About The Author

Latest News

వరస విజయాల ఇస్రోకు వందనం. వరస విజయాల ఇస్రోకు వందనం.
    మహబూబాబాద్ జిల్లా (లోకల్ గైడ్); మహబూబాబాద్ పట్టణ పరిధిలో నిన్న ఇస్రో ప్రయోగించిన రాకెట్ విజయవంతంఅయినా సందర్భంగా స్థానిక గాదెరుక్మరెడ్డిమెమోరియల్ హై లో సంబురాలు నిర్వహించారు.
నిర్బంధంతో ఉద్యమాల్ని ఆపలేరు.
సొంత వ్యాపారంతోనే ఆర్థిక అభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి  
పెండింగ్ లో ఉన్న కార్మికుల రెండు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి సిఐటియు ఆధ్వర్యంలో జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఉషారాణి  కి వినతిపత్రం ఇస్తున్న కార్మికులు
వార్షిక తనిఖీల్లో భాగంగా ఐదవ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన  అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ నిజామాబాదు రాజా వెంకటరెడ్డి...
పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం..... రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి