జగన్ ఇంటికెళ్తే కండువా......

నటుడు నిహార్ కపూర్ షాకింగ్ కామెంట్స్ – వైసీపీలో చేరినట్లు కాదు!

లెజెండరీ నటి జయసుధ తనయుడు నిహార్ కపూర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, జగన్ ఇంటికి వెళ్లిన సమయంలో వైసీపీ కండువా మెడలో వేసారని, అది పార్టీ చేరిక అని పొరపొచ్చారని స్పష్టం చేశారు. నిహార్ వ్యాఖ్యలతో వైసీపీ సంప్రదాయంపై నెటిజన్లలో చర్చ మొదలైంది.
Published On
జగన్ ఇంటికెళ్తే కండువా......

లెజెండరీ నటి జయసుధ తనయులు నిహార్ కపూర్, శ్రేయాన్ కపూర్ సినిమా రంగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. శ్రేయాన్ "బస్తీ" చిత్రంతో నటనకు గుడ్‌బై చెప్పగా, నిహార్ మాత్రం విభిన్న పాత్రలతో టాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న "హరిహర వీరమల్లు" సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నిహార్, ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర రాజకీయ విషయాన్ని వెల్లడించాడు.

గతంలో ఒకసారి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిసి ఆయన నివాసానికి వెళ్లినప్పుడు, జగన్ సమక్షంలో ఆయన మెడలో వైసీపీ కండువా వేసి ఫొటోలు తీసినట్లు నిహార్ తెలిపారు. ఈ ఫొటోలు వైరల్ కావడంతో నిహార్, జయసుధ వైసీపీలో చేరారని వార్తలు షికార్లు చేశాయి. అయితే, తాము వైసీపీలో చేరలేదని, కేవలం అభిమానంగా వెళ్లిన సందర్భంలో కండువా వేసినట్లు మాత్రమే జరిగిందని నిహార్ తేల్చి చెప్పారు.

జగన్ ఇంటికి వెళ్లిన ప్రతిఒక్కరికీ పార్టీ కండువా వేయడమా? అనే విధంగా నిహార్ వ్యాఖ్యలు ఉండటంతో, నెటిజన్లు వైసీపీ శైలి పై విమర్శలు గుప్పిస్తున్నారు. జయసుధకు వైఎస్‌పై అభిమానం ఉన్నప్పటికీ, అధికారికంగా పార్టీకి చేరినట్లు ఎక్కడా రుజువులు లేవని కూడా నిహార్ స్పష్టం చేశారు.

ఈ విషయమై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. "కండువా వేస్తే పార్టీలో చేరినట్లా?" అంటూ నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

ప్రజా సమస్యలను గాలికొదిలిన ఎమ్మెల్యే : సీపీఐ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి ప్రజా సమస్యలను గాలికొదిలిన ఎమ్మెల్యే : సీపీఐ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి
లోకల్ గైడ్ బెజ్జంకి జూన్ 22: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజా సమస్యలను పక్కనపెట్టి తన అనుచరుల పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారని సీపీఐ జిల్లా నాయకుడు...
నువా డైమండ్ ఆభరణాల కలెక్షన్ను ఆవిష్కరించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కోకాపేటలో
నీట్ రీ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు....
ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణం కోసం అంగన్వాడీల కృషి అభినందనీయం -గుడిమల్కాపూర్ డైరెక్టర్ బండారి శంకర్
రవీంద్రభారతిలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు వి హెచ్ హనుమంతరావుకు ఘన సన్మానం 
8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ:
వ్యవసాయం, సాగునీటి నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో పని చేయాలి ... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్