- AP News
- జగన్ ఇంటికెళ్తే కండువా......
జగన్ ఇంటికెళ్తే కండువా......
నటుడు నిహార్ కపూర్ షాకింగ్ కామెంట్స్ – వైసీపీలో చేరినట్లు కాదు!
లెజెండరీ నటి జయసుధ తనయులు నిహార్ కపూర్, శ్రేయాన్ కపూర్ సినిమా రంగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. శ్రేయాన్ "బస్తీ" చిత్రంతో నటనకు గుడ్బై చెప్పగా, నిహార్ మాత్రం విభిన్న పాత్రలతో టాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న "హరిహర వీరమల్లు" సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నిహార్, ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర రాజకీయ విషయాన్ని వెల్లడించాడు.
జగన్ ఇంటికి వెళ్లిన ప్రతిఒక్కరికీ పార్టీ కండువా వేయడమా? అనే విధంగా నిహార్ వ్యాఖ్యలు ఉండటంతో, నెటిజన్లు వైసీపీ శైలి పై విమర్శలు గుప్పిస్తున్నారు. జయసుధకు వైఎస్పై అభిమానం ఉన్నప్పటికీ, అధికారికంగా పార్టీకి చేరినట్లు ఎక్కడా రుజువులు లేవని కూడా నిహార్ స్పష్టం చేశారు.
ఈ విషయమై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. "కండువా వేస్తే పార్టీలో చేరినట్లా?" అంటూ నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు.
