ప్రశాంత వాతావరణంలో జీవించండి: రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు.

పదవీ విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన కమిషనర్

ప్రశాంత వాతావరణంలో జీవించండి: రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు.

నల్లగొండ ఉమ్మడి జిల్లా (లోకల్ గైడ్);  రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తూ గురువారం పదవీ విరమణ పొందిన టివి హనుమంతరావు అడిషనల్ డీసీపీ,స్పెషల్ బ్రాంచ్,  ఎం సుగుణ, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్,   (అకౌంట్స్), మహమ్మద్ షర్ఫుద్దీన్, సబ్ ఇన్స్పెక్టర్, సీసీఎస్ ఎల్ బి నగర్, డి రామకృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్, కంట్రోల్ రూమ్, మహమ్మద్ ఫైజుద్దీన్, సబ్ ఇన్స్పెక్టర్,  సీఐ సెల్, వి సాగర్ రావు, సబ్ ఇన్స్పెక్టర్ , ఉప్పల్ ఉమెన్  పోలీస్ స్టేషన్,  మహమ్మద్ షంషీర్ ఖాన్, ఏఆర్ ఎస్ఐ హెడ్ క్వార్టర్ భువనగిరి) లకు సీపీ  సుధీర్ బాబు, రాచకొండ పోలీస్ కార్యాలయంలో సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం  ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎంతో కాలం పాటు పోలీసుశాఖలో సమర్థవంతంగా, క్రమశిక్షణతో పనిచేసి తమ సేవలు అందించినందుకు అభినందించారు. పదవీ విరమణ అనంతరం విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని, ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపాలని, పెన్షన్ , ఇతర ఆర్థిక అంశాల పట్ల క్రమశిక్షణ పాటించాలని సూచించారు. వారికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు త్వరగా వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పదవీ విరమణ పొందే అధికారులు మరియు సిబ్బంది సంక్షేమం కోసం తాను ఏర్పాటు చేసిన పెన్షన్ డెస్క్ ద్వారా త్వరగా పెన్షన్ మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. 
ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ ఇందిరా, డిసిపి ఎస్బి జి నరసింహ రెడ్డి,  అడిషనల్ డీసీపీ అడ్మిన్ శివ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి రవీందర్ రెడ్డి, సీఈఓ అడ్మిన్ పుష్పరాజ్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్. భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి, టేకుల రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వరస విజయాల ఇస్రోకు వందనం. వరస విజయాల ఇస్రోకు వందనం.
    మహబూబాబాద్ జిల్లా (లోకల్ గైడ్); మహబూబాబాద్ పట్టణ పరిధిలో నిన్న ఇస్రో ప్రయోగించిన రాకెట్ విజయవంతంఅయినా సందర్భంగా స్థానిక గాదెరుక్మరెడ్డిమెమోరియల్ హై లో సంబురాలు నిర్వహించారు.
నిర్బంధంతో ఉద్యమాల్ని ఆపలేరు.
సొంత వ్యాపారంతోనే ఆర్థిక అభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి  
పెండింగ్ లో ఉన్న కార్మికుల రెండు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి సిఐటియు ఆధ్వర్యంలో జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఉషారాణి  కి వినతిపత్రం ఇస్తున్న కార్మికులు
వార్షిక తనిఖీల్లో భాగంగా ఐదవ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన  అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ నిజామాబాదు రాజా వెంకటరెడ్డి...
పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం..... రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి