భాజాపా పూర్తిస్థాయి మండల కమిటీ ఎన్నిక
రాజాపూర్లో భాజపా మండల కమిటీ నూతన పదవుల బాధ్యతల స్వీకారం
రాజాపూర్ ఆగస్టు 24:(లోకల్ గైడ్):
రాజాపూర్ మండల కేంద్రంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ మండల పూర్తిస్థాయి కమిటీ వేయడం జరిగింది. భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రాపోతుల శ్రీనివాస్ గౌడ్ లో ఆధ్వర్యంలో ఇప్పటికే ఉన్న మండల అధ్యక్షులు కాటేపాక ఆనంద్ తోపాటు నూతనంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శులుగా తక్కినపల్లి రాజు, గంగాధర్ గౌడ్, ఆల్లె మధు, మండల ఉపాధ్యక్షులుగా శేఖర్ గౌడ్, మాధవరెడ్డి, ప్రవీణ్ గౌడ్, శిరీషలు కోశాధికారిగా బాలా గౌడ్, కార్యదర్శులుగా ఉదయ్ గౌడ్, బాలరాజు, యు రాజు, బి మహేష్, జి హనుమంత్, జగదీష్, నాగరాజలు, శక్తి కేంద్ర ఇన్చార్జిలుగా మధు ఉదయ్ గౌడ్, బాలగౌడ్, ప్రవీణ్ గౌడ్ తదిరులను నియమించారు.
ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన
ప్రధాన కార్యదర్శి రాజేష్, సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి అశోక్ గుప్తా, జిల్లా సీనియర్ నాయకులు వనపర్తి నర్సిములు, పల్లె శేఖర్, శేఖర్ గౌడ్
లతోపాటు కమిటీ ఎన్నికకు సహకరించిన
ప్రతి ఒక్కరికి రాజాపూర్ మండల అధ్యక్షులు కాటేకగా ఆనంద్ కృతజ్ఞతలు తెలియజేశారు.
- నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు పార్టీ కోసం నిరంతరం పనిచేస్తామన్నారు.