అంతరించిపోతున్న ‘కుమ్మరి’ చేతివృత్తులు

ప్లాస్టిక్ దెబ్బకు మాయమవుతున్న మట్టి పాత్రలు.

అంతరించిపోతున్న ‘కుమ్మరి’ చేతివృత్తులు

తిరుగుడు చక్రం నెమ్మదించింది...జీవనోపాధి కోల్పోతున్న కళాకారులు. మట్టి వాసన మసకబారిపోతుంది.  - ప్రభుత్వ మద్దతు కోసం ఎదురుచూపులు

లోకల్ గైడ్/ తాండూర్:IMG-20250824-WA0085 ఒకప్పుడు గ్రామాలలో పండగలు వచ్చినా, పెళ్లిలు, నూతన గృహప్రవేశాలు, దేవుని నైవేద్యం తదితర శుభకార్యాల కోసం మట్టికుండలను ఎంతో సాంప్రదాయంగా వినియోగించేవారు. కుమ్మరి వారి ఇంటి నుంచి మట్టి కుండ లేకుండా ఎలాంటి శుభకార్యాలు జరిగేవి కావు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఆనాడు మట్టి కుండలకు అంత ప్రాధాన్యత ఉండేది. కానీ నేడు మార్కెట్లో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోవడం ద్వారా కుమ్మరి కళాకారుల చేతివృత్తులు అంతరించిపోతున్నాయి.  IMG-20250824-WA0087IMG-20250824-WA0083

ప్లాస్టిక్ పోటీ, మార్కెట్ లోటు… మట్టిపాత్రల శబ్దం మిన్నగిస్తోంది. ఒకప్పుడు ప్రతి ఊరి అంచున తిరుగుడు చక్రం గిరగిరా తిరిగేది. మట్టిగడ్డ కాస్తా కుండగా, చెంబుగా, కలసిగా రూపం దాల్చేది. కానీ ఇప్పుడు ఆ చక్రం నెమ్మదించింది. పాతికేళ్లలో ప్లాస్టిక్, స్టీల్, మెలమైన్ ఉత్పత్తులు మార్కెట్‌ను ఆక్రమించడంతో...సంప్రదాయక ‘కుమ్మరి’ చేతివృత్తులు అంతరించే దశకు చేరాయి.ఒక కుండ తయారు చేయడానికి సుమారు గంటల తరబడి శ్రమ. దానికి వచ్చే ధర మాత్రం ఖర్చుకీ సరిపోదు.దీంతో పిల్లలు ఈ పనిలోకి రావాలనుకోవటం లేదు అని స్థానిక కుమ్మరి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.మట్టిని తవ్వించుకోవడం కష్టమవటం, ఆమ్ పెట్టడం కోసం కాల్చే కట్టెల ఖరీదు పెరగటం, అమ్మకానికి స్థిరమైన చోటులేకపోవటం వంటివి ప్రధాన సమస్యలు వెంటాడుతున్నాయని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.గ్రామీణ హస్తకళలకు మార్కెట్ కల్పించాలంటే సహకార సంఘాలు, స్థానిక సంతలు, పండుగల సందర్భంగా ప్రత్యేక మట్టి ఉత్పత్తుల ఎగ్జిబిషన్–విక్రయాలు ఏర్పాటు చేయాలని కళాకారులు కోరుతున్నారు. “ఇ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో మమ్మల్ని కలిపితే యువత కూడా ఆసక్తి చూపుతారు. పాఠశాలల్లో ‘క్లే ఆర్ట్’ వర్క్‌షాప్‌లు పెడితే మా కళకు గుర్తింపు వస్తుంది అని ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా,పరిశ్రమ శాఖ అధికారుల సమాచారం ప్రకారం, సంప్రదాయక వృత్తులకు సాధనాల ఆధునీకరణ, వడ్డీరహిత చిన్న రుణాలు, డిజైన్ అప్‌గ్రేడ్ శిక్షణలపై దృష్టి పెట్టే చర్యలు అవసరం. అయితే, పథకాలు కాగితాల మీదనే కాక, లబ్ధిదారుల దాకా చేరాలని కళాకారులు కోరుతున్నారు.ముఖ్యంగా, పర్యావరణ హితమైన మట్టి పాత్రల వాడకం ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.“స్మార్ట్ విలేజీలు, స్మార్ట్ నగరాలంటే స్థానిక కళలకు నిలువనీడ కల్పించడమే. పబ్లిక్ క్యాంటీన్లు, హోటళ్లలో మట్టి గ్లాసుల వినియోగంపై ప్రోత్సాహకాలు ఇవ్వాలి,” అని కళాహితైషి సంఘాల ప్రతినిధులు సూచిస్తున్నారు.

 

 

*కుమ్మరుల ఆర్థిక స్థితిగతులు.*

కుమ్మరులు ఆర్థికంగా వెనుకబడిపోయారు.ఎందుకంటే గతంలో మట్టి పాత్రలు తయారు చేసే సమాజానికి అందించినప్పుడు కొద్దో గొప్పో ఆర్థికంగా బాగుండేది.కానీ ప్లాస్టిక్, సిరామిక్,స్టీల్ వచ్చిన తరువాత కుమ్మరుల వృత్తి అడుగంటి పోయింది. విషయం ఏమిటంటే, ప్రజల తిరిగి మళ్లీ మట్టి పాత్రలవైపు మొగుచూపుతుండడం హర్షనీయం.

 

 *కుమ్మరి చేతివృత్తుల డిమాండ్లు.*

గ్రామ స్థాయి హస్తకళా హాట్‌లు (స్థిర విక్రయ కేంద్రాలు)మట్టి, కట్టెల లభ్యతకు ఒక్క విండో అనుమతులు..తిరుగుడు చక్రాల విద్యుతీకరణ, కిల్న్‌లకు సబ్సిడీలు,డిజైన్–బ్రాండింగ్ శిక్షణ, ఆన్‌లైన్ విక్రయ సహాయం,పాఠశాల–కాలేజీల్లో కళా మేళాలు, ‘ఒక పండుగ—ఒక మట్టి ఉత్పత్తి’ ప్రచారం గ్రామాల గుర్తింపే గళగళలాడే ఆ చక్రం. ఆ శబ్దం మళ్లీ వినిపించాలంటే ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు రంగం చేతులు కలపాల్సిన సమయం ఇదే.లేదంటే మన చేతుల ముందే మట్టికళ మట్టిలో కలిసిపోయే ప్రమాదం ఉంది ఆకాంక్షిస్తున్నారు.

 

*మట్టి ప్రమిద ఎంతో ప్రత్యేక.*

ప్రతి దేవాలయం దగ్గర, ఇంట్లో పూజ గదిలో, శుభ కార్యాలలో మట్టి ప్రమిద లేనిది పూజ నిర్వహించలేం. అలాంటిది నేడు మట్టి ప్రమిదలు కనుమరుగ అయ్యే పరిస్థితి దాపరించింది. శుభ కార్యాల్లో, దసరా దీపావళి తదితర పండుగల సందర్భంగా కూడా మట్టి ప్రమిదలో నూనె పోసి దీపం వెలిగిస్తారు. రాను రాను ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో మట్టి ప్రమిదలు కనుమరుగవుతున్నాయి.

Tags:

About The Author

Latest News

సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
      లోకల్ గైడ్  : ప్రజల సమస్యలను నేరుగా వినిపించే వేదికగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సీఎం ప్రజావాణి” కార్యక్రమం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి
సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు అధికారులు
భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి సి యం రేవంత్ రెడ్డి
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి - ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి