విద్యారంగ సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు కొనసాగిద్దాం

భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్

విద్యారంగ సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు కొనసాగిద్దాం

ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి  అజిత్

కొత్తగూడెం లోకల్ గైడ్ :

ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా సమితి ఆధ్వర్యంలో  స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం లో  మంగళవారం ఏఐఎస్ఎఫ్  90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించరు. ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్  మాజీ జిల్లా  కార్యదర్శి  ఎస్.కె ఫహీమ్ దాదా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్  హాజరై  శ్వేతా అరుణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 
 స్వాతంత్ర్యం రాకపూర్వమే దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మహానగరంలో భగత్ సింగ్, రాజ్ గుర్, సుఖ్ దేవ్, ఆజాద్ ఇంకా ఎందరో వీరుల ఆశయ సాధన కోసం బబృద్దీన్ బాసు, ప్రేమ్ నారాయణ భార్గవ్ నాయకత్వాన 1936 ఆగస్టు12 న అఖిల భారత విద్యార్ధిసమాఖ్య  ఆవిర్భవించింది.అని బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల బానిసచేర నుంచి మాతృభూమి విముక్తి కై సాగిన వీరోచిత స్వాతంత్ర్య ఉద్యమంలో పొత్తిళ్లలోనే పిడికిళ్లు బిగించి స్వాతంత్ర్యము మా జన్మ హక్కు అని మా అంతం చూసిన స్వాతంత్ర్యోద్యమ పంతం వీడం అంటూ నినదించి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని, భరతమాత బానిస సంకెళ్ల నుంచి విముక్తి కావాలని ఎందరో విద్యార్థుల విప్లవ కిషోరుల బలిదానం చేసిన ఘనమైన చరిత్ర కలిగిన దేశములోనే ఏకైక విద్యార్ధి సంఘం.పోరాటాలు, త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటైన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వ విద్యా పరిరక్షణకై, శాస్త్రీయ విద్య, కామన్ విద్యావిధానం అమలుపై నిరంతరం పోరాటాలు సాగిస్తూ 89సంవత్సరాలుగా విద్యార్ధుల శ్రేయస్సు కోసం అశేష త్యాగాలు చేస్తూ ఆవిర్భావం నాటి నుంచి నేటివరకు గల్లి నుండి డిల్లీ వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలే ఊపిరిగా పోరాటాలే ప్రాణంగా  విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చదువుతూ పోరాడుతాం  చదువుకై పోరాడుతాం అంటూ తెలంగాణ రైతాంగ పోరాటంలో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వీరోచిత పోరాటం, 18 సంవత్సరములకు ఓటుహక్కు ఉద్యమం, మలిదశ తెలంగాణ పోరాటంలో, హాస్టళ్ల సమస్యలపై, విద్య వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకులపై అలుపెరుగని సమరశీల పోరాటాలు చేసి దేశంలో ఎన్నో విజయాలు సాధించింది.శాస్త్రీయ సోషలిజం తన గమ్యంగా, ప్రభుత్వ విద్యను, సెక్యులరిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం తన కర్తవ్యమని, సమరశీల విద్యార్థి ఉద్యమాల నిర్మాణంలో నిమగ్నమైన అఖిల భారత విద్యార్థి సమాఖ్య  89 వసంతాలు పూర్తిచేసుకుని 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న   విద్యావ్యతిరేక విధానాలపై ఏఐఎస్ఎఫ్ గా పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వినయ్, సంజయ్, నవిత,సోబిత,ప్రణయ్, వంశీ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నరు.

Tags:

About The Author

Latest News

ఘనంగా గ్రంథ పాలకుల దినోత్సవం  ఘనంగా గ్రంథ పాలకుల దినోత్సవం 
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల గ్రంథాలయం లో ఘనంగా జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవాన్ని నిర్వహించారు. భారతదేశంలో 'గ్రంథాలయ శాస్త్ర పితామహుడు' అని  పిలువబడే...
అత్యంత విచారకరమైన సంఘటన – జాగ్రత్త
రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి
అమెరికా నేలపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రోకేటివ్ వ్యాఖ్యలు – భారత్‌పై అణు దాడి బెదిరింపులు
ముహమ్మద్ అలీ’ – రింగ్‌లో గర్జించిన మహా వీరుడు, సమాజానికి మార్గదర్శి
భారత్‌పై 50% సుంకం – ట్రంప్ నిర్ణయంపై విమర్శల తుఫాన్
భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్