ఎమ్మెల్యే మర్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా రాఖీ పౌర్ణమి
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి రాఖీలు కట్టిన మహిళలు
By Ram Reddy
On
మల్కాజిగిరి, ఆగస్ట్ 9, (. లోకల్ గైడ్ ): రాఖీ పౌర్ణమి సహోదరత్వానికి, అనుబంధానికి ప్రతీక అని
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా పలువురు మహిళలు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ...రక్షా బంధన్ ను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఘనంగాజరుపుకునే పండుగ అన్నారు. ముఖ్యంగా ఆడబిడ్డలు తమ సోదరులు తమకు జీవితాంతం అండగా ఉండాలని ఆశిస్తూ కట్టే రక్షాబంధనం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని అన్నారు. ప్రజల్లో సహోదరభావాన్ని పెంపొందించే ఈ పండుగను నియోజకవర్గ ప్రజలంతా ఆనందోత్సాహాల్లో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునీత రాముయాదవ్, బీఆర్ఎస్ మహిళా నాయకులు శ్రీదేవి, సూలోచన, సరిత, శారద దేవి తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author

Latest News
09 Aug 2025 21:38:45
ఈ నెల 15న అలాస్కాలో జరగనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశాన్ని భారత విదేశాంగ శాఖ స్వాగతించింది. ఈ భేటీతో...