సాగునీటి సమస్యలు పరిష్కరించాలి.
గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కి వినతిపత్రం సమర్పించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
By Ram Reddy
On
నల్లగొండ ఉమ్మడి జిల్లా : గ్రీవెన్స్ డే సందర్భంగా సోమవారం,నల్లగొండ కలెక్టరేట్ లో కలెక్టర్ ఇలా త్రిపాఠి,ని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కలిసి నల్లగొండ జిల్లాలో సాగునీటి సమస్యలపై, నియోజకవర్గంలోని నీటి ప్రాజెక్టులకు నీటి సరఫరాపై వినతి పత్రం అందజేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ
నల్లగొండ జిల్లా రైతులు గత కొన్ని సంవత్సరాలుగా సాగునీటి సమస్యలతో నానా ఇబ్బందులు పడుతున్నారు,
ఈసారి పరిస్థితి మరింత దారుణంగా మారింది అన్నారు.నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండిపోయినా, ఏఎమ్మార్పీ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు తగిన నీరు అందకపోవడం అనేది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు.ఏఎమ్మార్పీ నాలుగో మోటార్ (యూనిట్) క్యాపిటల్ ఓవర్హాలింగ్ మరమ్మతు పనులు రెండు నెలల క్రితం ప్రారంభమైనప్పటికీ, సకాలంలో పూర్తిచేయకపోవడం ఘోర వైఫల్యం అన్నారు .జూలైలోనే పూర్తి కావాల్సిన ఈ పనులు, ఆగస్టు నెల వచ్చినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి...ఈ ఆలస్యం వలన ప్రస్తుతం మూడు మోటార్ల ద్వారానే 1800 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదల అవుతోంది అన్నారు.అందులో 525 క్యూసెక్కులు జంట నగరాలకు, 30 క్యూసెక్కులు మిషన్ భగీరథకు, 1200 క్యూసెక్కులు ఉదయ సముద్రం నింపేందుకు వాడుతున్నారు, దీంతో ఆయకట్టుకు నీరు చేరడం లేదు అన్నారు.
ప్రధాన కాల్వ నీటి విడుదలను 1200 క్యూసెక్కుల నుండి 950 క్యూసెక్కులకు తగ్గించడం జరిగింది అన్నారు.అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్కి చేరి, గుడిపల్లి, గుర్రంపోడ్ మండలాల్లో వేల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి ఉన్నారు . ఇది మాత్రమే కాకుండా శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా విడుదలైన నీటిని నిల్వ చేసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అన్నారు.
సరైన ప్రణాళికతో నిల్వ చేసి ఉంటే నల్లగొండ జిల్లాకు ఈ స్థాయి కష్టాలు వచ్చేవి కావు...ఉదయ సముద్రం ప్రాజెక్టుకు 1200 క్యూసెక్కుల నీటిని కేటాయిస్తూనే, అందులో కేవలం 1.2 క్యూసెక్కుల నీటినే తాగునీటి కోసం వినియోగించడం, మిగతా నీటిని సరైన విధంగా పంపిణీ చేయకపోవడం బాధాకరం అన్నారు.కేవలం 0.5 క్యూసెక్కుల నీటితో బ్రాహ్మణ వెల్లంల, ఉదయ సముద్రం, అయిటిపాముల ప్రాజెక్టులను నింపడం అసాధ్యం అని సాంకేతికంగా తెలిసినా, ప్రభుత్వం ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించింది...
గత సంవత్సరం ఇదే పరిస్థితి ఏర్పడినప్పటికీ పాఠాలు నేర్చుకోకుండా, ఈ సంవత్సరం ముందస్తు ప్రణాళికలు లేకుండా వ్యవహరించడం రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, అగౌరవాన్ని స్పష్టంగా చూపిస్తోంది ఆన్నారు..సాగర్లో నీరు సమృద్ధిగా ఉండి కూడా, రైతులు ధర్నాలకు దిగే పరిస్థితి రావడం దురదృష్టకరం అన్నారు .కాబట్టి, దీనిపై ప్రభుత్వం తక్షణ జోక్యం చేసుకొని ఏఎమ్మార్పీ నాలుగో మోటార్ మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన వెంటనే పూర్తి చేయాలనీ,
మోటార్లన్నీ పూర్తిస్థాయిలో పనిచేసేలా చేసి, రోజుకు కనీసం 2400 క్యూసెక్కుల నీటి విడుదలకు చర్యలు చేపట్టాలనీ,అన్ని డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లకు సమానంగా సాగునీరు చేరేలా పర్యవేక్షణ బలోపేతం చేయాలనీ,
శ్రీశైలం, ఉదయ సముద్రం నీటి వినియోగంపై సమగ్ర సమీక్ష చేసి, జిల్లాకు గరిష్ట లాభం చేకూరేలా తక్షణ నిర్ణయాలు తీసుకోవాలనీ,ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల రైతుల ఆగ్రహం రోజురోజుకూ పెరుగుతోందనీ, తక్షణ చర్యలు తీసుకోకపోతే, జిల్లా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే పరిస్థితి తప్పదని హెచ్చరించారు....
Tags:
About The Author

Latest News
11 Aug 2025 16:17:40
లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా : జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పునస్కరించుకొని బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల ఎస్వీ ప్రభుత్వ జూనియర్...