ఆపదలో ఆప్తుడిగా వస్తా అందరికీ అండగా ఉంటా పట్టణాభివృద్ధి కోసం పని చేయాలని

------పాత అలవాట్లు పక్కకెట్టి పని చేయండి

ఆపదలో ఆప్తుడిగా వస్తా అందరికీ అండగా ఉంటా పట్టణాభివృద్ధి కోసం పని చేయాలని

-------100 రోజుల  అవగాహన కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు  తూడి మేఘారెడ్డి

వనపర్తి లోకల్ గైడ్,

వనపర్తి మున్సిపాలిటీలో పనిచేసే అధికారులు సిబ్బంది అందరూ వారి వారి పాతా అలవాట్లను పక్కకు పెట్టి పట్టణాభివృద్ధి కోసం పని చేయాలని మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న అండగా ఉంటానని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.బుధవారం వనపర్తి మునిసిపాలిటీలో నిర్వహించిన 100 రోజుల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు వార్డు అధికారులుగా,మెప్మా ఆర్పీలుగా,జవాన్లుగా,మీరు నిరంతరం వనపర్తి పట్టణ ప్రజలకు అందించే సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే వారిని అభినందించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  ప్రత్యేక దృష్టి వనపర్తి జిల్లా కేంద్రం పై ఉందని త్వరితగతిన అభివృద్ధి చెందే వనపర్తి పట్టణాభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు కావాలన్నారు.గతంలో మీరు ఎలా పనిచేశారన్నది పక్కకు పెడితే నేటి నుంచి నిబద్ధతతో పనిచేయాలని, విధి నిర్వహణలో మీ దృష్టికి వచ్చే పొరపాట్లను నివృత్తి చేస్తూ, సమస్యలను పరిష్కరిస్తూ, ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఓటర్ లిస్ట్ పై ప్రత్యేక దృష్టి సారించి నిజమైన పట్టణ ఓటర్లను గుర్తించి,డబల్ ఎంట్రీలు ఉన్న వాటిని తొలగించాలని ఆయన సూచించారు. పని విషయంలో   నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మధుసూదన్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ద్విశతకంతో ఆకట్టుకున్న టీమ్ ఇండియా స్టార్ వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్, ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా ఏడో స్థానానికి...
ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0తో ఉద్యోగాల సృష్ఠి: మ‌ంత్రి లోకేశ్
స్వర్ణాంధ్ర విజన్–2047కు సంపూర్ణ మ‌ద్ద‌తు....
 గోదావ‌రి పుష్క‌రాల‌పై మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం, ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు....
శ్రీ భద్ర కాళి దేవస్థానంలో 15 రోజుల పాటు జరిగే శాకంభరీ నవరాత్ర మహోత్సవములు
చేతి వృత్తి వస్తువుల ప్రదర్శన/అమ్మకాలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి, మంత్రులు
అంతర్జాతీయ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.