జగదీశ్వర్ గౌడ్ జన్మదిన సందర్భంగా అమెరికాలో

-పూల మొక్కలు నాటిన మిరియాల ప్రీతం
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): చందానగర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ జన్మదిన సందర్భంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మేరీ ల్యాండ్ లో సీనియర్ కాంగ్రెస్ లీడర్ మిరియాల ప్రీతం ఆధ్వర్యంలో పూల మొక్కలు నాటి జగదీశ్వర్ గౌడ్ అన్న కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మిర్యాల ప్రీతం మాట్లాడుతూ..జగదీశ్వర్ గౌడ్ ప్రజల మనిషి అని రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా మంత్రిగా చూడాలని శేరిలింగంపల్లి ప్రజల కోరిక అని అన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ సిటిజన్ ల అయినా గోపాల్, ప్రసాద్, అనిల్, శ్రీధర్, మిలిత్, రియాల్ష్, విష్, సెంథన్, కీనన్, రాగిబ్, శ్రేయాన్ పాల్గొని జగదీశ్వర్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
About The Author

Latest News
