షాద్ నగర్ కుంగ్ ఫు మాస్టర్ అహ్మద్ ఖాన్ కు దక్కిన అరుదైన గౌరవం*

షాద్ నగర్ కుంగ్ ఫు మాస్టర్ అహ్మద్ ఖాన్ కు దక్కిన అరుదైన గౌరవం*

వరల్డ్ చారిటీ వెల్ఫేర్ ఫౌండేషన్ అవార్డు సొంతం

లోకల్ గైడ్ న్యూస్ (షాద్ నగర్ ) రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కోచ్, మాస్టర్ అహ్మద్ ఖాన్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టత్మకైనా వరల్డ్ చారిటీ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యర్యంలో హైదరాబాద్ లోని ఏఎస్ రావు నగర్ కమ్యూనిటీ హల్ ECIL పార్క్ లో నిర్వహించిన వరల్డ్ చారిటీ అవార్డ్స్ సర్మనీ లో షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్ కు కుంగ్ ఫు, మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం ప్రదర్శించిన సందర్బంగా బెస్ట్ కోచ్ అవార్డు దక్కింది.చిన్నప్పటి నుండి కరాటే, కుంగ్ ఫు పై ఆసక్తి తో కేశంపేట మండలం నుండి షాద్ నగర్ కు వచ్చి మాస్టర్ బాలరాజ్ వద్ద కుంగ్ ఫు లో మెలుకువలు నేర్చుకొని పైకేదుకుతూ ఇప్పుడు షాద్ నగర్ లో న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ పెట్టి ఎంతోమంది చిన్నారులు, మహిళలకు కుంగ్ ఫు లో శిక్షణ ఇచ్చి  వారిని ప్రోత్సహిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి లో ఎన్నో అవార్డులు, మెడల్స్ సాధించి షాద్ నగర్ కు పేరు ప్రతిష్టలు తీసుకువచ్చిన మాస్టర్ అహ్మద్ ఖాన్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. కుంగ్ ఫు విద్యార్థులకు క్రమశిక్షణ తో పాటు కర్రసాము, నాన్చాక్, సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేయాలో నేర్పుతు వారి జ్ఞాపకశక్తి ని పెంపోందిస్తూ ముందుకు సాగుతున్న తీరు అమోఘం. ఈ సందర్బంగా అతని పనితిరును గుర్తించి ప్రతిష్టత్మకమైన వరల్డ్ చారిటీ అవార్డు ను అతనికి అందజేశారు. ఈ సందర్బంగా మాస్టర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ తనను వరల్డ్ చారిటీ వెల్ఫేర్ ఫౌండేషన్ వారు గుర్తించి అవార్డు అందజేయడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్బంగా వరల్డ్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇకముందు కూడ చిన్నారి విద్యార్థుల కు, మహిళలకు కుంగ్ ఫు లో తర్పిదు ఇస్తూ ముందుకు సాగుతూ షాద్ నగర్ పేరు జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో నిలబెట్టడానికి సాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు.

Tags:

About The Author

Latest News

IPL 2026లో ఆడతానో లేదో డిసెంబర్‌లో చెబుతా – ధోనీ IPL 2026లో ఆడతానో లేదో డిసెంబర్‌లో చెబుతా – ధోనీ
లోకల్ గైడ్ : మహేంద్ర సింగ్ ధోనీ, భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకరైన ఆయన, అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లోనే వీడ్కోలు పలికినా, ఇండియన్...
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది – సర్వదర్శనానికి 8 గంటల సమయం మాత్రమే
సినీ హీరో రానా దగ్గుబాటి బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో ఈరోజు అమలులో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో ఓటరు మోసాలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు – ఐదు ప్రధాన రకాల మోసాల జాబితా
భూమి లోతుల్లో పుట్టిన వజ్రాల కథ – ఆభరణాలకే కాదు, పరిశ్రమలకు కూడా ఆభరణం
హైదరాబాద్‌లో వరద ముంపు ప్రాంతాలపై సీఎం రేవంత్ ఆకస్మిక తనిఖీ
వంగవీడులో 630 కోట్ల జవహర్ ఎత్తిపోతల పథక శంకుస్థాపన – మంత్రి కోమటి రెడ్డి