పట్టణంలో పారిశుధ్య పనులు పరిశీలించిన కలెక్టర్

పట్టణంలో పారిశుధ్య పనులు పరిశీలించిన కలెక్టర్


కామారెడ్డి (లోకల్ గైడ్); ఇటీవల కురుస్తున్న వర్షాల ప్రభావంతో నీరు నిల్వ ఉండి  అధికంగా దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలలో  పారిశుద్ధ్య కార్యక్రమాలు పగడ్బందీగా నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో పాశుద్ధ్య కార్యక్రమాలను జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్ తో కలిసి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు కురిసిన అనంతరం వాన నీరు  నిలిచి ఉండి ఆ నీటిలో దోమలు అధికంగా వృద్ధి చెందుతాయని అన్నారు .అధికారులు జిల్లా వ్యాప్తంగా గ్రామాలు పట్టణాలలో  పారిశుద్ధ్య కార్యక్రమాలు మరింత పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు . ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా  చర్యలు తీసుకోవాలని, నీరు నిలువ ఉన్న ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ వేయాలని, డ్రైనేజీలు శుభ్రం చేయాలని, డ్రై డే రెగ్యులర్ గా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు . మరొకసారి జిల్లాలో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున  మున్సిపాలిటీలో ఎక్కడ కూడా డ్రైనేజీలు బ్లాక్ కాకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు . వనమహోత్సవం కార్యక్రమం ద్వారా కామారెడ్డి మున్సిపాలిటీకి  నిర్దేశించిన రెండు లక్షల మొక్కలను  ఈ నెల చివరిలోగా నాటి జియో ట్యాగింగ్ చేసి ఆన్లైన్లో వివరాలను పొందుపరచాలని అన్నారు . కలెక్టరేట్ ఆవరణలో మియావకి పద్ధతిలో మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలని,  వర్షాలలో దెబ్బతిన్న పట్టణంలోని రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేయించాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి ని ఆదేశించారు.

Tags:

About The Author

Related Posts

Latest News

నాంది పూజతో నడయాడిన శ్వేతార్కలయం నాంది పూజతో నడయాడిన శ్వేతార్కలయం
హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్): కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ క్షేత్రంలో 2025 గణపతి నవరాత్రి ఉత్సవ కల్యాణోత్సవ వేడుకలు నేటితో  ప్రారంభమయ్యాయి...
మా భూమిలో అక్రమ నిర్మాణాలు ఆపండి..!
ముగియనున్న శ్రావణమాసం బోనాలు
మహిళా శిశు వికాస కేంద్రం నిర్వాహకులకు కలెక్టర్ హితవు
ఉస్మాన్ సాగర్ జలాశయం 2 గేట్ల ఎత్తి నీరు విడుదల
దేశంలో సాంకేతిక రంగం అభివృద్ధికి ఆధ్యుడు  రాజీవ్ గాంధీ
పట్టణంలో పారిశుధ్య పనులు పరిశీలించిన కలెక్టర్