తండ్రిని హతమార్చిన కొడుకు.

- మద్యం మత్తులో ఘాతుకానికి పాల్పడిన కిరాతకుడు.  - అనంతరం పోలీసులకు ఫోన్ చేసి పరారీ. - పెద్దేముల్ మండలంలో ఘటన.
Published On
తండ్రిని హతమార్చిన కొడుకు.

లోకల్ గైడ్/ తాండూర్: మద్యం మత్తులో తండ్రిని హతమార్చిన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని గొట్లపల్లి గ్రామానికి చెందిన తలారి హనుమంతు (70) అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉండేవాడు. హనుమంతు కుమారుడు అయినటువంటి నిందితుడు తలారి రవి నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి తల్లిదండ్రులను వేధించేవాడు. ఒక ఎకరా భూమి తన పేరుమీద పట్టా చేయమని తల్లిదండ్రుల పైన గొడవ పడి ఘోరంగా హింసించేవాడు. అయితే, బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తలరి రవి ఎప్పటిలాగే మద్యం సేవించి వచ్చి, ఇంట్లోనే ఉన్న తండ్రి హనుమంతును బలమైన ఇనుప ఆయుధంతో ముఖం,నుదుటిపైన కొట్టడంతో,తీవ్ర రక్తస్రావం అవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్సై వేణు కుమార్ తెలిపారు.అంతేకాకుండా, హత్యకు ముందు రోజు తన తల్లి అయిన నరసమ్మతో గొడవ పడి..ఆమె చేతి పైన బలంగా కొట్టడంతో, ఆమె చేతి విరిగి నిస్సాయక స్థితిలో పడింది.ఈ నేపథ్యంలో, కుటుంబ సభ్యులు మృతుడి భార్య నరసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Tags:

About The Author

Related Posts

Latest News

ప్రజా సమస్యలను గాలికొదిలిన ఎమ్మెల్యే : సీపీఐ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి ప్రజా సమస్యలను గాలికొదిలిన ఎమ్మెల్యే : సీపీఐ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి
లోకల్ గైడ్ బెజ్జంకి జూన్ 22: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజా సమస్యలను పక్కనపెట్టి తన అనుచరుల పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారని సీపీఐ జిల్లా నాయకుడు...
నువా డైమండ్ ఆభరణాల కలెక్షన్ను ఆవిష్కరించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కోకాపేటలో
నీట్ రీ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు....
ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణం కోసం అంగన్వాడీల కృషి అభినందనీయం -గుడిమల్కాపూర్ డైరెక్టర్ బండారి శంకర్
రవీంద్రభారతిలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు వి హెచ్ హనుమంతరావుకు ఘన సన్మానం 
8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ:
వ్యవసాయం, సాగునీటి నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో పని చేయాలి ... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్