ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర స్థాయి సమీక్ష: జిల్లా కలెక్టర్లతో మంత్రుల సమావేశం

ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర స్థాయి సమీక్ష: జిల్లా కలెక్టర్లతో మంత్రుల సమావేశం

హైదరాబాదు: లోకల్ గైడ్:

 

 ధాన్యం కొనుగోళ్లలో సమస్యలపై జిల్లా కలెక్టర్లతో వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు , పౌర సరఫరాల శాఖా మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి,, సీఎస్ శ్రీ రామక్రిష్ణారావు సమీక్ష చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో జరిగిన ఈ సమీక్షలో పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మొక్కజొన్న కొనుగోలులో ఎకరాకు 18.5 క్వింటాళ్ల నుంచి 25 క్వింటాళ్ల వరకు పరిమితి పెంచడం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారని జిల్లా కలెక్టర్లు మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావుకు తెలిపారు.

 

 పత్తి కొనుగోలులో ఎల్1 ఎల్2 నిబంధనల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్లు మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావుకు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధన ఎత్తివేసి, 12 క్వింటాళ్ళు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందని మంత్రి తెలిపారు.

 

 వర్షాల వల్ల రంగుమారిన సోయా చిక్కుడు కొనుగోలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదన పంపినట్లు జిల్లా కలెక్టర్లకు మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంటల సేకరణకు ఈ నవంబర్ నెల కీలకమని జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి