లోకల్ గైడ్/బంట్వారం:
బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల మీ బ్యాంక్ రివార్డు పాయింట్లు గడువు ముగియబోతున్నాయి పాయింట్లను నగదుగా మార్చుకోండి వంటి సందేశాలు వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా పంపిస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు తెరలేపుతున్నారని తెలిపారు. ఆ సందేశాల్లో ఉన్న లింకులను క్లిక్ చేయించి, APK ఫైల్స్ డౌన్లోడ్ చేయించుకుని మొబైల్ ఫోన్లలోకి చొరబడి బ్యాంక్ ఖాతాల నుండి డబ్బులు కాజేస్తున్నారని వివరించారు.ప్రజలు ఇటువంటి ఫేక్ మెసేజ్లను నమ్మవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ OTPలు, బ్యాంక్ ఖాతా వివరాలు, పిన్ నంబర్లు పంచుకోవద్దని ఎస్సై విమల సూచించారు.ఏవైనా అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్లు వచ్చిన పక్షంలో సమీప పోలీస్ స్టేషన్కు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు.ప్రజల అప్రమత్తతతోనే సైబర్ మోసాలను అరికట్టగలమని ఎస్సై విమల, స్పష్టం చేశారు.