ఆర్.సి.పురంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

ఆర్.సి.పురంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): పఠాన్ చేరు నియోజకవర్గంలోని రామచంద్రపురం పట్టణంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని స్వామి వివేకానంద విగ్రహానికి సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ సి.అంజి రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు స్వామి వివేకానంద బోధనలు, యువతకు ఆయన అందించిన సందేశాలను స్మరించుకున్నారు. దేశ నిర్మాణంలో యువశక్తి పాత్ర అత్యంత కీలకమని, యువత జాగృతమైతే సమాజం, దేశం వేగంగా అభివృద్ధి సాధిస్తుంద ని తెలిపారు. స్వామి వివేకానంద చూపిన మార్గంలో నడుచుకుంటూ సేవాభావంతో సమాజా భివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు