శ్రీరామ్ నగర్‌లో సంక్రాంతి వేడుకలు

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కార్పొరేటర్ హమీద్ పటేల్

శ్రీరామ్ నగర్‌లో సంక్రాంతి వేడుకలు

 

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ, ఏ బ్లాక్‌లో గల శ్రీరామ హై స్కూల్ ప్రిన్సిపాల్ ఈ. వెంకటేశ్వర్లు నూతన గృహంలో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకలలో భాగంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ పిల్లలతో కలిసి భోజనం చేశారు. సంక్రాంతి వేడుకలను నిర్వహించిన ప్రిన్సిపాల్ ఈ. వెంకటేశ్వర్లు కు కార్పొరేటర్ అభినందనలు తెలిపారు. అలాగే ప్రిన్సిపాల్ కుటుంబ సభ్యులకు, స్కూల్ పిల్లలకు, ఉపాధ్యాయులకు, సిబ్బందికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కార్పొరేటర్ హమీద్ పటేల్, చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాల విలువలను తెలుసుకోవాలని సూచించారు. పెద్దలను గౌరవించడం, వారి మాటను పాటించడం, మంచి విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని అన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు కలిసి కార్పొరేటర్ హమీద్ పటేల్ ని శాలువాతో సత్కరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తిరుపతి యాదవ్, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి