మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం:

టికెట్ రానివాళ్లకు న్యాయం చేసేలా కాంగ్రెస్ పని చేస్తుంది 

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం:

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

 ఖమ్మం,: లోకల్ గైడ్

ఖమ్మంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం అని అన్నారు

 

పేదలకు ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్లనే పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించారని అన్నారు. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను దీవించడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఫలితాలు వచ్చిన తరవాత పదేళ్లు దొరలపాలన చేసిన వాళ్లకు అర్బన్ పై కూడా నమ్మకం పోతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులు కచ్చితంగా గెలుస్తారు అనే నమ్మకం ఉంది కాబట్టి ఎక్కువమంది టికెట్లు ఆశిస్తున్నారని అన్నారు. టికెట్ రానివాళ్లు కూడా అర్థం చేసుకుంటారని అధికారంలో ఉన్నాం కాబట్టి ఒక కౌన్సిలర్, వార్డు మెంబర్ టికెట్ రానంతమాత్రాన బాధపడాల్సిన అవసరం లేదన్నారు. టికెట్ రానివాళ్లకు న్యాయం చేసేలా కాంగ్రెస్ పనిచేస్తుందని అన్నారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు