నాగరంజిత్ కు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే అభినందనలు
నాగరంజిత్ రాష్ట్రస్థాయి ప్రధమ బహుమతి సాధించిన విషయం పాఠకులకు విదితమే.
రాష్ట్రస్థాయిలో హైదరాబాద్ లోని దోమల్ గూడ వ్యాయామ కళాశాలలో ప్రత్యేక అవసరాల విద్యార్ధులకు జరిగిన ఆటల పోటీలలో 50 మీటర్ల రన్నింగ్ లో అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధి నాగరంజిత్ రాష్ట్రస్థాయి ప్రధమ బహుమతి సాధించిన విషయం పాఠకులకు విదితమే. ఈ సందర్భంగా అశ్వారావుపేట శాసన సభ్యులు జారే ఆదినారాయణ పాఠశాలలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అబినందించి సత్కరించారు. విద్యార్ధి శిక్షణ అవసరాల నిమిత్తం రెండువేల రూపాయలు బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధి ప్రత్యేక అవసరాలు కలిగి ఉన్నప్పటికీ వైకల్యం దేనికీ అడ్డుకాదని నిరూపిస్తూ ప్రధమస్థానంలో నిలబడడం గర్వించదగిన విషయమని ఈ విషయంలో విద్యార్ధులను తీర్చిదిద్దుతూ అన్ని రంగాల్లో పాఠశాలను అభివృద్ధి చేస్తూ ఉపాధ్యాయులను సమన్వయ పరుస్తూ విద్యార్ధులను తీర్చిదిద్దుతున్న ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత అభినందనీయులని అన్నారు. అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుటకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పాఠశాలలో ఆడిటోరియం నిర్మిస్తామని విద్యార్ధులు క్రీడల్లో రాణించే విధంగా అశ్వారావుపేటలో క్రీడామైదానం పనులు జరుగుతున్నాయని, దొంతికుంట పార్కును అందంగా తీర్చిదిద్దుతామని, ఎకోపార్క్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని పాఠశాల ఎదురుగా ఇబ్బంది లేకుండా సిసి రోడ్ ను నిర్మాణానికి శంకుస్థాపన చేశామని విద్యార్ధులంతా చదువులో రాణించి ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలోద మండల విద్యాధికారి పి ప్రసాదరావు, పాఠశాల ప్రధానోపాధ్యయురాలు హరిత, పాఠశాల ఉపాధ్యాయులు, సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు పాల్గొన్నారు.
