ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో భేటీ. - రాబోయే మున్సిపల్ ఎన్నికల గురించి చర్చించినట్లు.
బిజెపి నాయకులు ఇందురు రాములు వెల్లడి.
By Ram Reddy
On
లోకల్ గైడ్/తాండూర్:
చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బిజెపి నాయకులు ఇందురు రాములు, యు రమేష్ పలువురు ఆదివారం హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో ఆయనకు శాలువ పూలదండతో ఘనంగా సన్మానించారు. అనంతరం బిజెపి కండువా కప్పి రాములును ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ... రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త సమష్టిగా పనిచేయాలని ఎంపీ సూచించినట్లు ఆయన తెలిపారు. గ్రూప్ తగాదాలకు పోకుండా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు. రమేష్, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
05 Feb 2026 22:02:09
లోకల్ గైడ్ : షాద్నగర్
అన్నపై ఉన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు గుర్రపల్లి భాను యాదవ్. తన అన్న లల్లు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా భాను...
