అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం-కాంగ్రెస్ పార్టీ జిల్లేడు చౌదరి గూడెం మండల అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు. 

ఎల్కగూడెంలో సర్పంచ్ బంధయ్య తో కలిసి సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన చలివేంద్రం పల్లి రాజు. 

అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం-కాంగ్రెస్ పార్టీ జిల్లేడు చౌదరి గూడెం మండల అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు. 

IMG-20260205-WA0071జిల్లేడు చౌదరి గూడెం, (లోకల్ గైడ్):

అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ జిల్లేడు చౌదరి గూడెం మండల అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు అన్నారు. బుధవారం ఎల్కగూడెంలో రూ. 5 లక్షలతో చేపట్టే సీ సీ రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ ఇతర గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... గతం లో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలతో పాటు ఊహించని అభివృద్ధి పనులను చేస్తున్నాడన్నారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక చొరవ తీసుకోని నియోజకవర్గం అభివృద్ధికి కోట్ల రూపాయలను నిధులను
మంజూరు చేయటం జరిగిందన్నారు. అదే విధంగా గ్రామ సర్పంచ్ చాకలి బంధయ్య మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న ప్రతి సమస్యను ఎమ్మెల్యే శంకర్ అన్న సహకారంతో దశల వారిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. బోయ ఈదైయ్య ఇంటి నుంచి చిటుకూరి నవాజ్రెడ్డి ఇంటి వరకు సిసి రోడ్డు వేయటం జరుగుతుందన్నారు. గ్రామం లో అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సర్పంచ్ ని లోకల్ గైడ్ దినపత్రిక ఎడిటర్ చిల్కమర్రి రాంరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కామిటీ డైరెక్టర్ వెంకట నర్సింహా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తమ్ముడు అంటే ఇలా ఉండాలి. తమ్ముడు అంటే ఇలా ఉండాలి.
లోకల్ గైడ్ : షాద్‌నగర్ అన్నపై ఉన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు గుర్రపల్లి భాను యాదవ్. తన అన్న లల్లు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా భాను...
టీజేఎంయూ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎండీ ఫస్సిద్దిన్ ఏకగ్రీవ ఎంపిక 
షాద్ నగర్ పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ కు ఓటు వేయండి.
కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధిని అందించగలదు.
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం-కాంగ్రెస్ పార్టీ జిల్లేడు చౌదరి గూడెం మండల అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు. 
మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య