పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంచాలకులు నవీన్ నికోలస్ కు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని వినతి.
ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .(లోకల్ గైడ్).
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు సంచాలకులు నవీన్ నికోలస్ నీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకుడు కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఎస్సీఎస్టీ ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ అమలు చేసే సందర్భంలో జి.ఓ.నెం.2 లోని అడక్వసీని కారణంగా చూపుతూ,ఓపెన్ లో ప్రమోషన్ వచ్చిన వారిని రిజర్వేషన్ లో కలుపుతూ మొత్తంగా ఎస్ . సి-15%, ఎస్. టి-10% పరిమితం చేస్తూ అడక్వసీ పూర్తి అయినదని తదుపరి ఎస్సీఎస్టీల రోస్టర్ లను జనరల్ వారికి కేటాయించటం వల్ల ఎస్సీఎస్టీ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతునదని వివరించారు. సరిచేసి న్యాయం చేయాలని కోరగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించడంతో పాటు ఎస్సీఎస్టీ ఉపాధ్యాయుల ఉన్నత విద్యకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ లకు కూడా పీజీ/ఎం ఈ డి చేసుకోనుటకు అడ్డంకిగా ఉన్న మెమో నెం.26559 ను రద్దుపరిచి, జి.ఓ.342 ను ఎలాంటి షరతులు లేకుండా ఓ.డి.సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ
కార్యక్రమంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర అధ్యక్షులు తొంట సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శి పెంట అంజయ్య,వర్కింగ్ ప్రెసిడెంట్ లు సూర్యదేవర దానయ్య, చాగంటి ప్రభాకర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మోతె సాయన్న, అసోసియేట్ అధ్యక్షులు బి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
