గురుకుల విద్యార్థులు ఇక సురక్షితం

మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కొందుర్గు కేజీబీవీ ఉపాధ్యాయుల కృతజ్ఞతలు..

గురుకుల విద్యార్థులు ఇక సురక్షితం

పాఠశాలలో భద్రత కోసం సీసీ కెమెరాలు అందజేసిన సయ్యద్ సాధిక్* 

 

( లోకల్ గైడ్ షాద్ నగర్ )

 

పాఠశాల విద్యార్థుల రక్షణ లక్ష్యంగా మీరు చూపిన దాతృత్వానికి వందనం.. మీ సేవకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అందిస్తున్నాం మేమందరం.. అంటూ కొందరు కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ సయ్యద్ సాధిక్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసిన ఆయన ఈ పాఠశాలలో కూడా విద్యార్థులకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో సీసీ కెమెరాలు దగ్గరుండి ఏర్పాటు చేయించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అధికారి షకీలా నిస్సితో సహా, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సహాయం వల్ల పాఠశాలలో భద్రత మరింత బలపడిందని, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ,సిబ్బందికి సురక్షితమైన విద్య వాతావరణం ఏర్పడిందని పేర్కొన్నారు. ఆయన సహకారం అమూల్యమని, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు. దీనిపై సయ్యద్ సాధిక్ స్పందిస్తూ చదువుకుంటూ భవిష్యత్తు వైపు సాగే విద్యార్థులకు రక్షణ ఎంతో అవసరమని, అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని వెల్లడించారు. విద్యార్థులకు ఎంతో కొంత సహాయపడగలిగినందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News

అలాస్కాలో ట్రంప్-పుతిన్ భేటీకి భారత్ స్వాగతం – ఉక్రెయిన్‌లో శాంతికి మార్గం? అలాస్కాలో ట్రంప్-పుతిన్ భేటీకి భారత్ స్వాగతం – ఉక్రెయిన్‌లో శాంతికి మార్గం?
ఈ నెల 15న అలాస్కాలో జరగనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశాన్ని భారత విదేశాంగ శాఖ స్వాగతించింది. ఈ భేటీతో...
బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కు రాఖి కట్టిన అక్క చెల్లెలు 
గురుకుల విద్యార్థులు ఇక సురక్షితం
హుస్నాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో ఘనంగా రాఖీ పౌర్ణమి
ఎనుముల తిరుపతి రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్...
ఎమ్మెల్యే మర్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా రాఖీ పౌర్ణమి 
శ్రీ శక్తి ఆలయంలో రక్షా బంధన్-పాల్గొన్న ఎమ్మెల్యే