తెలుగు దినపత్రికలో వచ్చిన “వారికి అన్ని అమ్మే” అనే క్యాప్షన్‌తో ప్రచురితమైన వార్తపై స్పందించిన

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, తక్షణమే స్పందించి, సంబంధిత విషయాన్ని స్థానిక తహశీల్దార్ సైదులుని విచారించమని ఆదేశించారు.

తెలుగు దినపత్రికలో వచ్చిన “వారికి అన్ని అమ్మే” అనే క్యాప్షన్‌తో ప్రచురితమైన వార్తపై స్పందించిన

ఖమ్మం :లోకల్ గైడ్ :
మంత్రి  ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు వెంటనే స్థల పరిశీలన చేసి, సమస్యను సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా శ్రీమతి తూమాటి కృష్ణవేణి కి రెండు పడక గదుల ఇల్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయబడినవి.

ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ,డ్రా.తుమ్మల యుగేందర్ గారు,  ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి శ్రీమతి తూమాటి కృష్ణవేణి కి ఇంటి తాళాలు మరియు ఉత్తర్వులను అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అవసరమైన ప్రతి సహాయాన్ని అందిస్తూ వారి పక్కనే నిలుస్తామని హామీ ఇచ్చారు.

Tags:

About The Author

Latest News

అభివృద్ధే మా లక్ష్యం ప్రజల రక్షణే మాధ్యేయం  అభివృద్ధే మా లక్ష్యం ప్రజల రక్షణే మాధ్యేయం 
చర్ల : లోకల్ గైడ్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లం పరిధిలో ఉన్న ఆర్ కొత్తగూడెం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సర్పంచ్ తుర్రం రవికుమార్,...
ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల
విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం
ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.
ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి
రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ ను
కారేపల్లి రైల్వే భూసేకరణపై కలెక్టరేట్ లో సమావేశం