ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.

హనుమకొండ జిల్లా ప్రతినిధి ఏప్రిల్04(లోకల్ గైడ్

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఆరోగ్య వారోత్సవాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్,ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 6 నుండి 11 వరకు ఆరోగ్య వారోత్సవాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్  పాయి అన్నారు.శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో  ఆరోగ్య వారోత్సవాల నిర్వహణకు సంబంధించి సంబంధిత విభాగాల అధికారులతో సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఆరోగ్య వారోత్సవాల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో ఆరోగ్య వారోత్సవాలను పురస్కరించుకొని వారం రోజులపాటు ఆరోగ్యానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 6 వ తేదీన న ఫుడ్ సేఫ్టీ ఆహార భద్రతపై దృష్టి పెట్టి ఆహార కల్తీ వల్ల వచ్చే జబ్బుల గురించి అవగాహన కలిగించాలని పేర్కొన్నారు. పబ్లిక్ గార్డెన్ నుండి ఐడిఓసి వరకు Eat Right Walk నిర్వహించాలన్నారు.  రెసిడెన్షియల్ విద్యాసంస్థలలో పనిచేసే ఫుడ్ హాండ్లర్స్ కుక్స్ కి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. స్ట్రీట్ వెండర్స్  కి గుర్తింపు పత్రం, శిక్షణ ఇవ్వాలన్నారు. 
 7వ తేదీన న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అవగాహన కార్యక్రమాలు ఉంటాయన్నారు. 8వ తేదీ న సురక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా గర్భిణీల చెకప్, సి సెక్షన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, లింగ నిర్ధారణ చట్టం గురించి వివిధ భాగస్వాముల తో  ఐ డి ఓ సి లో వర్క్ షాప్ నిర్వహించాలని సూచించారు. 9వ తేదీ న ఎయిడ్స్ అవేర్నెస్ రెడ్ రన్ వాక్ TB/HIV  హై రిస్క్  గ్రామాల్లో స్క్రీనింగ్, హెచ్ఐవి బాధిత పిల్లలకు పోషకాహార పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్నారు.10 వ తేదీ న హోమియోపతి అండ్ ఆయుష్ డే సందర్భంగా జిల్లా కేంద్రాల్లో యోగా డిమానిస్ట్రేషన్ ,హోమియోపతి మెడికల్ క్యాంపు నిర్వహించాలని పేర్కొన్నారు. 
11వ తేదీన డ్రగ్ నియంత్రణ విభాగం ద్వారా ప్రజలకు మందుల వినియోగంపై అవగాహన, డ్రగ్ అబ్యుస్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాన్నారు. వారం రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాలకు సంబంధించిన వివిధ అంశాలను వివిధ విభాగాల బాధ్యతలను డిఎంహెచ్ఓ వివరించారు. 
ఈ కార్యక్రమంలో హనుమకొండ డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య,  డిపిఓ లక్ష్మీ రమాకాంత్, ఏసిపి నరసింహారావు, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ,  అడిషనల్ డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్ మదన్ మోహన్ రావు, ఎంజీఎం ఆర్ఎంవో డాక్టర్ రఘునాథ్, డాక్టర్ మధుకర్ యాదవ్, డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్  బ్రహ్మాజీ, గర్ల్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సునీత, అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, ఆయుష్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేందర్ యాదవ్,, డెమో వి అశోక్ రెడ్డి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మేనేజర్ స్వప్న మాధురి, ఆయుష్ డిపిఓ భాను ప్రకాష్,  తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం
    వెంకటాపురం : లోకల్ గైడ్ :ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని యాకన్నగూడెం గ్రామపంచాయతీ ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థుల కోసం ఎలకల రామారావు ఆధ్వర్యంలో టేబుల్,
ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.
ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి
రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ ను
కారేపల్లి రైల్వే భూసేకరణపై కలెక్టరేట్ లో సమావేశం 
భూ సేకరణ ప్రక్రియ ను త్వరగా పూర్తి చేయాలి.
ఆళ్లపల్లిలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటన