మహిళా పోలీసులు లక్ష్యం దిశగా పనిచేయాలి
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
గండిపేట్ (లోకల్ గైడ్); మహిళా పోలీస్ లందరూ ఓ లక్ష్యం దిశగా పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ , గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ లో మొదటి తెలంగాణ మహిళా పోలీస్ అధికారుల రాష్ట్రస్థాయి సదస్సును మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సదస్సులో పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ ఐఏఎస్ మొదటి మహిళా పోలీస్ అధికారుల రాష్ట్రస్థాయి లక్ష్యాలను సదస్సులో చర్చించే అంశాలను మంత్రకి వివరించారు, ఈ మూడు రోజుల సదస్సులో కానిస్టేబుల్ నుండి డిజిపి స్థాయి అధికారులందరూ ఐదు గ్రూపులుగా చర్చించి నివేదికను రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... మహిళా శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఎల్లవేళలా సహకరిస్తుందని తెలిపారు. మహిళా అధికారులందరూ అంకిత భావం, క్రమశిక్షణ, గౌరవం తో పనిచేయాలని ఆమె కోరారు
సదస్సులో పాల్గొన్న మహిళ అధికారులకు మీరంతా ఓ కమిట్మెంట్ తో పనిచేస్తే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని ఆమె పేర్కొంది. సదస్సులో మీ సమస్యలపై చర్చించి మంచి సూచనలను రూపొందించాలని కోరారు . మహిళ అధికారుల సంఖ్య పెరుగుతున్నందుకు గర్వపడుతున్నానని, మహిళా శిశు సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతామని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా పోలీస్ అధికారులకు పూర్తి ప్రోత్సాహం అందిస్తామని, భవిష్యత్తులో మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉండేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళా పోలీస్ అధికారుల శిక్షణ,భద్రత సౌకర్యాలపై దృష్టి పెడతామని ఆమె తెలిపారు.
మహిళా పోలీసుల సమస్యల కోసం డిజిపి ప్రత్యేకమైన ఓ సెల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. మహిళా పోలీసుల కోసం తమిళనాడు కేరళ రాష్ట్రాలలో మహిళా అధికారులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించిన విధంగా వాటిని స్టడీ కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇంకా మహిళా అధికారుల ఆరోగ్యం కోసం మానసిక ఒత్తిడి తగ్గించే విధంగా కౌన్సిలింగ్లో ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా మహిళా పోలీస్ అధికారులే పోలీస్ స్టేషన్లో బాధితులుగా మారవద్దని సూచించారు.
సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 పోలీస్ స్టేషన్లో ఇతర యూనిఫామ్ డిపార్ట్మెంట్ జైలు శాఖ అటవీశాఖ ఉండి దాదాపు 400 మంది అధికారులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ ఐపీఎస్, స్వాతి లక్రా ఐపీఎస్, అడిషనల్ డీజీ బాలనాగ దేవి ఐపీఎస్, అడిషనల్ డిజిపి చారు
సిన్హా ఐపీఎస్, అడిషనల్ డీజీ రమా రాజేశ్వరి ఐపీఎస్,అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ కవిత, డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, డిజిపి ఎస్పీలు ఎస్సైలు కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
