రూ. 25 లక్షల ఆరోగ్య బీమా పథకం – ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వ భారీ భరోసా
ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికి వర్తించే విధంగా చారిత్రక ఆరోగ్య రక్షణ నిర్ణయం – 3,257 రకాల చికిత్సలు ఉచితం
ఆదాయానికి సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతీ పౌరుడికి రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించే చారిత్రాత్మక ఆరోగ్య బీమా పాలసీని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
లోకల్ గైడ్ విశాఖపట్నం, సెప్టెంబర్ 7:
ప్రజల ఆరోగ్యమే అసలైన సంపద అని నమ్మే కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలందరికీ సమాన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఓ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క పౌరుడికి వర్తించేలా రూ. 25 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేసింది. ఇది దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రం ప్రవేశపెట్టని విధంగా అత్యధిక పరిమితి కలిగిన ఆరోగ్య భీమా పథకంగా గుర్తింపు పొందుతోంది.
ఆసుపత్రిలో చేరిన 6 గంటలలోపే చికిత్సకు అనుమతి మంజూరు అయ్యేలా ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీ ఆధారంగా ప్రత్యేక సిస్టమ్ను రూపొందించింది. పారదర్శకత పెంచేందుకు QR కోడ్లు, హెల్ప్లైన్ కంట్రోల్ రూమ్లు వంటి సదుపాయాలు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. పౌరులు తమ ఆరోగ్య బీమా స్టేటస్ను సులభంగా తనిఖీ చేసుకునే అవకాశమూ కల్పించబడింది.
ఈ ఆరోగ్య బీమా పాలసీ ముఖ్యంగా మధ్యతరగతి, పేద కుటుంబాలకు భారీ ఉపశమనం కలిగించనుంది. ఖరీదైన వైద్యం కోసం అప్పులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా, కుటుంబాలను ఆర్థికంగా రక్షించే కవచంగా ఇది నిలవనుంది.
ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించినట్లు, "ఆరోగ్య పరిరక్షణ అందరికీ చేరాలి. వైద్యంలో ఖరీదే ఆటంకం కాకూడదు." ఈ పథకం రాష్ట్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ఈ చొరవ ప్రతి పౌరుడికి ఆశాజ్యోతి కాబోతోందని ప్రభుత్వం నమ్మకం వ్యక్తం చేసింది.
మా ప్రభుత్వ లక్ష్యం – ప్రతి కుటుంబానికి భరోసా, ప్రతి వ్యక్తికి రక్షణ, ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం.