లోకల్ గైడ్ అనంతపురం, సెప్టెంబర్ 7:
రాప్తాడు నియోజకవర్గంలోని వెంకటాపురం గ్రామంలో ఈరోజు మాజీ మంత్రి, రాయలసీమ ప్రజల వీరనాయకుడు స్వర్గీయ శ్రీ పరిటాల రవీంద్ర గారి ఘాట్ వద్ద ఘనంగా నివాళుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సహచర మంత్రులు, స్థానిక శాసనసభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాడితుల కోసం పోరాడిన ప్రజా యోధుడిగా, పీడితులకు ఆశగా నిలిచిన పరిటాల రవీంద్ర గారి సేవలు అమూల్యమైనవని మంత్రులు పేర్కొన్నారు. రాయలసీమ ప్రజల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి, తన ప్రాణాలను కూడా పణంగా పెట్టిన నేతగా ఆయన గుర్తింపు పొందారు. దళితులు, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తపించిన నేతగా ఆయనకు ప్రజల గుండెల్లో విశేష స్థానం ఉంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు మాట్లాడుతూ, "పరిటాల రవి గారు ఆత్మస్థైర్యానికి, సాహసానికి మరో పేరు. ప్రజల సమస్యలపై నిర్భయంగా గళమెత్తిన నాయకుడు. ఆయన్ని మరిచిపోవడం సాధ్యం కాదు. ఆయన ఆశయాలనే మనం ముందుకు తీసుకెళ్లాలి" అని తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. స్వర్గీయ నాయకుడి సేవలు, త్యాగాలను గుర్తు చేసుకుంటూ, ‘పోరాట యోధుడా... అందుకో మా జోహార్లు!’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
పరిటాల రవీంద్ర గారి సేవలు రాయలసీమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కట్టుబడి పనిచేయాలని మంత్రులు పిలుపునిచ్చారు.