నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా ఘన నివాళులు

లోకల్ గైడ్ :
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లి తమ తాతకు పుష్పగుచ్ఛంతో నివాళి అర్పించారు. ఘాట్ వద్ద కాసేపు కూర్చుని ఎన్టీఆర్ చేసిన సేవలను తలచుకున్నారు, అనంతరం అక్కడి నుండి వెళ్లిపోయారు.ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రముఖుల రాక నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఏడాది తాత జయంతిని పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి ఘాట్కి వెళ్లడం సాంప్రదాయంగా కొనసాగుతుంది. అభిమానులు కూడా పెద్దఎత్తున అక్కడికి చేరుకొని ఆయనకు తమ గౌరవాన్ని తెలియజేస్తారు.
సాధారణ ఉద్యోగి స్థాయి నుంచి నంబర్ వన్ హీరోగా, ఆపై ముఖ్యమంత్రిగా ఎదిగిన ఎన్టీఆర్, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ సందర్భంగా మే 28ను ఎన్టీఆర్ జయంతిగా పురస్కరించుకుంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్టీఆర్ సినీ రంగంపై తనదైన ముద్ర వేసిన గొప్ప కళాకారుడు. తన కెరీర్లో ఎన్నో విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. *‘తోడుదొంగలు’*లో ముసలివాడిగా, *‘రాజుపేద’*లో ఆకర్షణలేని వ్యక్తిగా, *‘కలిసిఉంటే కలదు సుఖం’*లో వికలాంగుడిగా నటించి మెప్పించారు. అంతేకాదు, ‘గుండిగంటలు’, ‘చిరంజీవులు’, ‘ఆత్మబంధువు’, ‘బడిపంతులు’ వంటి చిత్రాల్లో ఆయన నటన వైవిధ్యాన్ని చాటారు.
ఎన్టీఆర్ ధర్మపాత్రలైనా, దుర్మార్గ పాత్రలైనా తేడా లేకుండా ఒదిగిపోయేవారు. రాముడు, రావణుడు, కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, అర్జునుడు, భీముడు వంటి ప్రతీ పాత్రలో ఆయన జీవించేవారు. అలాంటి మహానుభావుడికి ఈ జయంతి సందర్భంగా భారత ప్రజలు, ముఖ్యంగా తెలుగు జనులు మరుపురాని నివాళులు అర్పిస్తున్నారు.
About The Author
Latest News
