తరుణ్ సుధీర్ నిర్మాణంలో రూపొందుతున్న ‘ఏలుమలై’ నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన ‘రా చిలకా’ మెలోడీ సాంగ్ విడుదల*

తరుణ్ సుధీర్ నిర్మాణంలో రూపొందుతున్న ‘ఏలుమలై’ నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన ‘రా చిలకా’ మెలోడీ సాంగ్ విడుదల*

*

రాన్నా, ప్రియాంక ఆచార్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తరుణ్ కిషోర్ సుధీర్ నిర్మాణంలో పునీత్ రంగస్వామి తెరకెక్కించిన చిత్రం ‘ఏలుమలై’. నరసింహా నాయక్ (రాజు గౌడ) సమర్పణలో తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్ బ్యానర్లపై యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటి వరకు ‘ఏలుమలై’ నుంచి వచ్చిన టైటిల్ టీజర్, పోస్టర్ ఇలా అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

 

సిధ్ శ్రీరామ్ ఆలపించిన ‘రా చిలకా’ అనే పాట శ్రోతల్ని ఆకట్టుకునేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు డి. ఇమ్మాన్ బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ఈ పాటలో చూపించిన లొకేషన్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ చూస్తుంటే ఈ చిత్రంలో అందమైన ప్రేమ కథ దాగి ఉందని అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ ‘రా చిలకా’ లిరికల్ వీడియో యూట్యూబ్‌లో అందరినీ మెప్పించేలా ఉంది. 

 

కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్, సేలం, ఈరోడ్ వంటి వివిధ ప్రదేశాలలో ఈ మూవీని చిత్రీకరించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

 

నటీనటులు : రాన్నా, ప్రియాంక ఆచార్, జగపతి బాబు, నాగభరణ, కిషోర్ కుమార్, సర్దార్ సత్య, జగప్ప తదితరులు నటించారు.

 

సాంకేతిక బృందం

బ్యానర్ : తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్

నిర్మాత : తరుణ్ సుధీర్

సహ నిర్మాత : అట్లాంట నాగేంద్ర

దర్శకుడు : పునీత్ రంగస్వామి

సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి

ఎడిటింగ్: కె.ఎం. ప్రకాష్

డైలాగ్స్: నాగార్జున శర్మ, పునీత్ రంగస్వామి

సంగీతం: డి. ఇమ్మాన్

పీఆర్వో : సాయి సతీష్

Tags:

About The Author

Related Posts

Latest News

కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం
  కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ : కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
కూకట్పల్లి–బాలానగర్ ఇంద్రనగర్ బస్తీ ఎన్నికలు | సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం | అధికారిక ఫలితాలు త్వరలో
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి
ఓవర్ లోడ్ వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది మృతి
గురుకుల విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యం – షాద్‌నగర్‌లో ఉద్రిక్తత
ఫోరెన్సిక్ సైన్స్‌ పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి