సిద్ధిపేటలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం.

19 మందికి రూ1.93 లక్షల జరిమానా

సిద్ధిపేటలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం.

సిద్దిపేట జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్ తెలంగాణ) 

మార్చి24:సిద్ధిపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 19 మందిని గుర్తించి పట్టుకున్నారు. ట్రాఫిక్ సీఐ కె. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా వారు మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది.
పట్టుబడిన వారిని మార్చి 24, 2026న సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శ్రీ కాంతారావు గారి ముందు హాజరుపరచగా, విచారణ అనంతరం మొత్తం రూ.1,93,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన ఇద్దరికి కలిపి రూ.10,000 జరిమానా విధించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం తమకే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదకరమని హెచ్చరించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి కోర్టు ద్వారా రూ.10,000 వరకు జరిమానా విధించడం జరుగుతుందని, దీని ద్వారా ప్రజల్లో అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే ఒక్కొక్కరికి రూ.5,000 జరిమానా విధించబడుతుందని స్పష్టం చేశారు.

Tags:

About The Author

Latest News

ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి. ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.
హనుమకొండ జిల్లా ప్రతినిధి ఏప్రిల్04(లోకల్ గైడ్ హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఆరోగ్య వారోత్సవాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్,ప్రజా...
ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి
రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ ను
కారేపల్లి రైల్వే భూసేకరణపై కలెక్టరేట్ లో సమావేశం 
భూ సేకరణ ప్రక్రియ ను త్వరగా పూర్తి చేయాలి.
ఆళ్లపల్లిలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటన
9న మాజీ మంత్రివర్యులు తన్నీరు.హరీష్ రావు పర్యటన విజయవంతం చేద్దాం.