భూ సేకరణ ప్రక్రియ ను త్వరగా పూర్తి చేయాలి.

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

భూ సేకరణ ప్రక్రియ ను త్వరగా పూర్తి చేయాలి.

హనుమకొండ జిల్లా ప్రతినిధి ఏప్రిల్04 లోకల్ గైడ్ 

 హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో వివిధ ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ పురోగతి, భూభారతి దరఖాస్తులు, మీసేవ సర్టిఫికెట్ల జారీ తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష,
హనుమకొండ జిల్లాకు సంబంధించిన వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. 
శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో వివిధ ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ పురోగతి, భూభారతి దరఖాస్తులు, మీసేవ సర్టిఫికెట్ల జారీ, తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గౌరవెల్లి, జాతీయ రహదారులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పురోగతి, భూభారతి దరఖాస్తులు, సాదా బైనామా, పెండింగ్ లో ఉన్న మీసేవ సర్టిఫికెట్లు  పరిష్కారానికి తీసుకోవాల్సిన సత్వర చర్యలపై కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ రవి ఆర్డీవోలు, జాతీయ రహదారుల శాఖ, ఆర్ అండ్ బి అధికారులతో పాటు  తహసీల్దారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి ధర్మసాగర్ వేలేరు మండలాల్లో  భూ సేకరణ ప్రక్రియలో భాగంగా పెగ్ మార్కింగ్  వెంటనే మొదలు పెట్టాలని సూచించారు. అదేవిధంగా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కూడా మార్కింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన వివిధ సర్టిఫికెట్ల జారీ లో పెండింగ్లో ఉంచవద్దని అన్నారు. అదేవిధంగా జన గణనకు సంబంధించి హౌస్ లిస్టింగ్ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయడంలో సహాయ సహకారాలను అందించాలని తహసీల్దారులకు సూచించారు.ఈ సందర్భంగా హనుమకొండ పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కన్నం నారాయణ, జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి అధికారులు, తహసీల్దారులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం
    వెంకటాపురం : లోకల్ గైడ్ :ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని యాకన్నగూడెం గ్రామపంచాయతీ ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థుల కోసం ఎలకల రామారావు ఆధ్వర్యంలో టేబుల్,
ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.
ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి
రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ ను
కారేపల్లి రైల్వే భూసేకరణపై కలెక్టరేట్ లో సమావేశం 
భూ సేకరణ ప్రక్రియ ను త్వరగా పూర్తి చేయాలి.
ఆళ్లపల్లిలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటన