ఆళ్లపల్లిలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటన
క్షేత్రస్థాయిలో పర్యటనలు పెంచి ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి
By Ram Reddy
On
అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం
భద్రాద్రి కొత్తగూడెం, లోకల్ గైడ్ :
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జగదీష్వర్ ప్రసాద్, ఎంపీడీఓ శ్రీను, మండల ప్రత్యేక అధికారి లాల్ చంద్ తదితరులు పాల్గొన్నారు.
*ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతంపై సమీక్ష*
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడిఓసి కార్యాలయంలో ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు సమర్థవంతంగా అందాలని, ప్రైవేటు ఆసుపత్రులపై ఆధారపడకుండా ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలని సూచించారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మరుగుదొడ్ల మరమ్మత్తులతో పాటు, పెండింగ్లో ఉన్న భవన నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. జిల్లాలో సికిల్ సెల్ అనీమియా కేసులు ఎక్కువగా ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి, పరీక్షల నిర్వహణపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రైవేటు స్కానింగ్ సెంటర్లపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని, బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ, పరిశుభ్రమైన వాతావరణంలో రోగులకు సేవలు అందించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో డిసిహెచ్ఓ రవిబాబు మరియు వివిధ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
04 Apr 2026 21:39:31
వెంకటాపురం : లోకల్ గైడ్ :ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని యాకన్నగూడెం గ్రామపంచాయతీ ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థుల కోసం ఎలకల రామారావు ఆధ్వర్యంలో టేబుల్,
