ప్రకృతి వ్యవసాయ కిట్ల పంపిణీ – రైతులకు అవగాహన కల్పించిన  అధికారులు

రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని అధికారులు

ప్రకృతి వ్యవసాయ కిట్ల పంపిణీ – రైతులకు అవగాహన కల్పించిన  అధికారులు

సిద్దిపేట జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్ తెలంగాణ)

మార్చి17:సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లోని బేగంపేట గ్రామం లో రసాయన ఎరువుల అధిక వినియోగంతో నేల సారం దెబ్బతింటున్న నేపథ్యంలో, రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని అధికారులు సూచించారు. ఈ మేరకు బెజ్జంకి మండలంలో ప్రకృతి వ్యవసాయ కిట్లను రైతులకు పంపిణీ చేస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏవో సంతోష్ మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్’ ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయని తెలిపారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి, ప్రకృతి సిద్ధమైన పద్ధతులను అవలంబించాలని సూచించారు.
ఆవు పేడ, ఆవు మూత్రంతో తయారు చేసే జీవామృతం, బీజామృతం వంటి సేంద్రియ ఎరువులు నేల సారాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. వీటి వినియోగం ద్వారా పంటల దిగుబడి మెరుగుపడటమే కాకుండా, రైతుల పెట్టుబడి వ్యయం కూడా తగ్గుతుందని వివరించారు.అలాగే, ప్రకృతి వ్యవసాయం ద్వారా పండే పంటలు పూర్తిగా విషరహితంగా ఉండి, ప్రజల ఆరోగ్యానికి మేలు చేస్తాయని పేర్కొన్నారు. రైతులు సంప్రదాయ రసాయన సాగును విడిచిపెట్టి, ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది సర్పంచులు ఏలా విజయ,D సురేష్, P రమేష్ మాజి సర్పంచ్ P వెంకట్ రెడ్డి వార్డ్ మెంబర్ రాజు మహేందర్ మరియు రైతులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ. ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ.
  ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
గాలి గూడెంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశo
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.
బిజ్వార్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం 
ఛత్రపతి శివాజీ,అంబేద్కర్ విగ్రహావిష్కరణ భూమి పూజలో
హైదరాబాద్‌లో ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’ నిర్వహణ – యువతలో ఫిట్‌నెస్, విలువలకు నూతన దిశ
శాసనసభలో ఆర్‌&బీ శాఖపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగం