మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.

నాగులపల్లి గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి. 

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.

డ్వాక్రా భవన  నిర్మాణం కోసం భూమి పూజ.

లోకల్ గైడ్/ తాండూర్:
మహిళలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అని నాగులపల్లి గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి తెలిపారు. ఆదివారం రూ.10 లక్షల ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులతో నిర్మించనున్న మహిళా సమైక్య భవనం కోసం స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగిరెడ్డి మాట్లాడుతూ... ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాలలో దశలవారీగా అభివృద్ధి చేసుకుందామని సూచించారు.ఇందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని తెలిపారు. పార్టీలకతీతంగా గ్రామ అభివృద్దే ప్రధాన ఏజెండాగా ముందుకెళ్దామని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శేఖర్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు ఏం రమేష్, హెచ్. అశోక్, గ్రామస్తులు వీరారెడ్డి,  హన్మంతు, అశోక్ గౌడ్, శ్రీనివాస్, మంగలి బసవరాజ్, యాదప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తమ్ముడు అంటే ఇలా ఉండాలి. తమ్ముడు అంటే ఇలా ఉండాలి.
లోకల్ గైడ్ : షాద్‌నగర్ అన్నపై ఉన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు గుర్రపల్లి భాను యాదవ్. తన అన్న లల్లు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా భాను...
టీజేఎంయూ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎండీ ఫస్సిద్దిన్ ఏకగ్రీవ ఎంపిక 
షాద్ నగర్ పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ కు ఓటు వేయండి.
కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధిని అందించగలదు.
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం-కాంగ్రెస్ పార్టీ జిల్లేడు చౌదరి గూడెం మండల అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు. 
మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య