శోభాయమానంగా రామలింగేశ్వరుడి నగరోత్సవం..
రామలింగేశ్వర స్వామి ఊరేగింపును ప్రారంభించిన
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నల్లగొండ ఉమ్మడి జిల్లా లోకల్ గైడ్
నార్కెట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవములను పురస్కరించుకుని స్వామి వారి నగరోత్సవం నల్గొండ పురవీధుల శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది., జిల్లా కేంద్రంలోని రామాలయం ఆవరణంలో ప్రతేక్య ఏర్పాటు చేసిన వాహనంలో స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేసి పూజలు నిర్వహించారు .ఈ.
కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హజరై నగరోత్సవాన్ని ప్రారంభించి. భజన చేశారు.ఈ కార్యక్రమంలో డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఆలయ ఈవో, నల్గొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, నార్కెట్పల్లి మండల అధ్యక్షులు బత్తుల ఉషయ్య, చెర్వుగట్టు సర్పంచ్ నేతగాని కృష్ణ,భక్తులు తదితరులు పాల్గొన్నారు..
