జిల్లా గ్రంథాలయం అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి...... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

మారుతున్న సాంకేతికత కు అనుగుణంగా పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో పెట్టాలి.

జిల్లా గ్రంథాలయం అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి...... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నూతన భవనం, ప్రహరీగోడ నిర్మాణం సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలి. ఖమ్మం నగరం బస్ డిపో రోడ్ లోని డిస్ట్రిక్ లైబ్రరీ లో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.

ఖమ్మం, మార్చి - 25 :లోకల్ గైడ్ :

జిల్లా గ్రంథాలయంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, పాఠకులకు, విద్యార్దులకు అవసరమైన వసతుల కల్పనపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.

బుధవారం స్థానిక బస్ డిపో రోడ్ లోని జిల్లా గ్రంథాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. లైబ్రరీ ఆవరణంలో నూతనంగా నిర్మిస్తున్న అదనపు భవనం, చుట్టూ ప్రహరీగోడ, టాయిలెట్ల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. నిర్మితమవుతున్న నూతన రెండు అంతస్ధుల భవనంతో పాటు విద్యార్ధులకు, అభ్యర్ధులు, పాఠకులకు కావాల్సిన వసతుల ఏర్పాట్లను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనుసంధానంగా ప్రహారీ గోడ, గేట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 

అనంతరం గ్రంథాలయంలోని రీడింగ్ రూమ్ లలో తిరుగుతూ కావాల్సిన వసతుల అవసరాలను కలెక్టర్ గుర్తించారు. అక్కడ ఉన్న పాఠకులతో, పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులతో జిల్లా కలెక్టర్ ముచ్చటించారు. ఏ పోటీ పరీక్షలకు సన్నద్దం అవుతున్నారు, ఎటువంటి  పుస్తకాలు కావాలి, ఏమైనా అవసరాలు కావాలా వివరాలు అందిస్తే పది రోజుల్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, యుద్ధ ప్రాతిపదికన లైబ్రరీ అదనపు భవనం, నిర్మాణ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అన్నారు. అభ్యర్దులు, విద్యార్థులకు అనువైన అధునిక వసతులతో చేపట్టిన నిర్మాణ పనులు నాణ్యతతో సకాలంలో పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. IMG-20260325-WA0115

గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించి ప్రతి సంవత్సరం అప్ డేట్ అయిన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని, ఎప్పటికప్పుడు పాతవి మార్చాలని, పాఠకులు యువకులతో చర్చించి పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు ప్రతి విభాగం వారీగా అవసరమైన పుస్తకాల జాబితాను తయారు చేసి వెంటనే అందించాలని కలెక్టర్ గ్రంథాలయ నిర్వాహకులకు సూచించారు. 

గ్రంథాలయంలో వివిధ రకాలైన పుస్తకాలు అన్ని రంగాల్లో రాణించే విధంగా కృషి చేసేందుకు దోహదపడుతాయని అన్నారు. కొత్త రకం ఛాలెంజ్ తో ప్రాక్టికల్ లర్నింగ్ ద్వారా ఆలోచన శక్తి పెంపొందించి పోటీ పరీక్షలకు ఉపయోగపడుతాయని తెలిపారు. లైబ్రరీ లోని పలు వార్తాపత్రికలు, సాహిత్యంతో విజ్ఞానాన్ని పొందవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా విద్యార్థులు, యువత గ్రంథాలయాల సేవలను ఉపయోగించుకుని తమ భవిష్యత్తును గమ్యాలను చేరుకోవాలని తెలిపారు. విద్యార్థులు, యువత  విలువైన కాలాన్ని వృథా చేసుకోకుండా, అదే సమయాన్ని గ్రంథాలయంలో గడపడం ద్వారా కొత్త కొత్త విషయాలు, విజ్ఞానం పెంచుకోవచ్చన్నారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సిబ్బంది భాస్కర్ రావు, అఖిల్, రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

అభివృద్ధే మా లక్ష్యం ప్రజల రక్షణే మాధ్యేయం  అభివృద్ధే మా లక్ష్యం ప్రజల రక్షణే మాధ్యేయం 
చర్ల : లోకల్ గైడ్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లం పరిధిలో ఉన్న ఆర్ కొత్తగూడెం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సర్పంచ్ తుర్రం రవికుమార్,...
ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల
విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం
ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.
ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి
రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ ను
కారేపల్లి రైల్వే భూసేకరణపై కలెక్టరేట్ లో సమావేశం