యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని స్టేజ్ -1 లోని  800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటవ యూనిట్ ను  జాతికి అంకితం చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ,ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు.

  970 కోట్ల రూపాయల వ్యయంతో వైటీపీఎస్ లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి.

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని స్టేజ్ -1 లోని  800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటవ యూనిట్ ను  జాతికి అంకితం చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ,ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు.


నల్లగొండ ఉమ్మడి జిల్లా (లోకల్ గైడ్);

      ఈ డిసెంబర్ చివరి నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని అన్ని యూనిట్లను పూర్తిచేసి 2026  జనవరి నుండి పూర్తిస్థాయిలో విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్కమల్లు తెలిపారు. ఇందుకుగాను నిర్దేశించిన క్యాలెండర్ ప్రకారం పని చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇదివరకే రూపొందించిన క్యాలెండర్ ను తూ.చా తప్పకుండా పాటించాలన్నారు.

                శుక్రవారం ఆయన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అట్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లతో కలిసి నల్గొండ జిల్లా, దామరచర్ల మండలం, వీర్లపాలెం వద్ద ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం  కలిగిన స్టేజ్ -1 లోని ఒకటవ యూనిట్ జాతికి అంకితం చేశారు. అంతేకాక 970 కోట్ల రూపాయలతో వై టి పి ఎస్ ఆవరణలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే వనమహోత్సవం కింద మొక్కలు నాటారు.

         అనంతరం వైటిపిఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ నిర్దేశించిన సమయంలో గా అన్ని యూనిట్ల ద్వారా విద్యుత్ అందించేందుకు వైటిపీఎస్ అధికారులు పనులను ప్రాధాన్యత క్రమంలో విభజించుకోవాలన్నారు .సంవత్సర కాలంలోనే స్టేజ్ వన్ లోని రెండు యూనిట్లను పూర్తి చేసి విద్యుత్ అందించడం పట్ల ఆయన వైటీపీఎస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు . డిసెంబర్లో గా అన్ని యూనిట్లను పూర్తి చేసి జనవరి 1 ,2026 నుండి. పూర్తి స్థాయిలో విద్యుత్ అందించేలా సమయాన్ని, అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పని చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ప్రోటోకాల్ ను పాటించాలని ,అంతేకాక యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయనే విధంగా అభివృద్ధి చేయాలని ,అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల ,ఆస్పత్రులు నిర్మించి పరిసర ప్రాంతాల ప్రజలకు మేలు జరిగేలా చూడాలని చెప్పారు. పవర్ ప్లాంట్ ఆవరణలోని డిఏవి పాఠశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల ను పవర్ ప్లాంట్ లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు .అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా పనికొచ్చే విధంగా ఆసుపత్రి నిర్మాణం, అంబులెన్స్ ఏర్పాటు చేయాలన్నారు. బొగ్గు లారీలు ,బూడిద లారీలతో రోడ్లు దెబ్బతిన్న కారణంగా సిసి రోడ్లను మంజూరు చేయడం జరిగిందని ,యుద్ధ ప్రాతిపదికన సిసి రోడ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని, ఇందుకు సంబంధించి నష్టపరిహారం ,భూసేకరణకు సంబంధించిన పనులు సైతం వెంటనే పూర్తి చేయాలని తెలిపారు.
    
          రాష్ట్ర నీటిపారుదల ,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలోనే విష్ణుపురం డబుల్  రైల్వే లైన్ మంజూరు కావడం జరిగిందని, అయితే  ఇప్పటివరకు పనులు పూర్తికాలేదని,త్వరితగతిన పనులు పూర్తి చేయాలని చెప్పారు.  93 కిలోమీటర్ల డబుల్ లైన్ రైల్వే పనులకు సరైన నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి రానందున ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు .
             రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రహదారుల పూర్తికి 280 కోట్ల రూపాయలు మంజూరు చేయడమే కాక క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలిపారు.
         మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసినప్పటికీ సామాజిక బాధ్యతగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ప్రాజెక్టు నుండి ఎలాంటి సహకారం అందించడం లేదని తెలిపారు.

       రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ  నవీన్ మిట్టల్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సిఎస్ఆర్ కింద నిధులు విడుదల చేశామని, ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. వై టి పి ఎస్ లోని అన్ని విభాగాలలో లాగ్ బుక్  ఆన్లైన్లో నమోదు తప్పనిసరిగా చేయాలని, ప్రతి ఉద్యోగి కార్డుతోనే  యాక్సెస్ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని, అన్ని యూనిట్ల లో పాటించే ప్రోటోకాల్ ను పై చార్ట్ లు ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు ప్రోటోకాల్ అప్డేట్ చేయాలని, పాఠశాల ఆస్పత్రుల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని యూనిట్లను నిర్దేశించిన ప్రకారం డిసెంబర్లో గా పూర్తి చేసి వచ్చే సంవత్సరం జనవరి ,ఫిబ్రవరి నాటికి అనుకున్న స్థాయిలో విద్యుత్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర జెన్కో సిఎండి డాక్టర్ హరీష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైటీపీఎస్ ప్రస్తుత పరిస్థితిని వివరించారు.వైటీ పీఎస్ కు సంబంధించి రెండు యూనిట్లను పూర్తి చేయడం జరిగిందని, స్టేజి -2లో ఉన్న మూడు యూనిట్లు ఇదివరకే నిర్దేశించిన క్యాలెండర్ ప్రకారం పూర్తి చేయడం జరుగుతుందని, కంట్రోల్ యూనిట్లు, రైల్వే లైన్, ఇతర పనులపై ఆయన వివరాలు తెలియజేశారు.

         అనంతరం ఉప ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వై టి పి ఎస్ లోని యూనిట్ వన్ ద్వారా 800 మెగావాట్ల విద్యుత్తు అందించే యూనిట్ ను జాతికి అంకితం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జనవరి 21 2025 న రెండవ యూనిట్ ను జాతికి  అంకితం చేశామని, స్టేజ్ వన్ లోని అన్ని యూనిట్లు పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి  చేస్తుండగా ,స్టేజి- 2 కు సంబంధించిన యూనిట్లలో టార్గెట్ ఏర్పాటు చేసుకొని, డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు జనవరి 26 నుండి పూర్తిగా అంకితం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.గత ప్రభుత్వం రెండు సంవత్సరాలు వైటిపిఎస్ కు సంబంధించిన పర్యావరణ అనుమతులను క్లియరెన్స్ తీసుకురాక పోవడం వల్ల రెండు సంవత్సరాలు ప్రాజెక్టు పనులు ఆలస్యం అయ్యాయని,  తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సమయాన్ని నిర్దేశించుకొని అనుకున్న కార్యాచరణ ప్రకారం సంవత్సరం, నెల, వారానికి చేయాల్సిన పనులపై క్యాలెండర్ ప్రకారం ముందుకు వెళ్లి సంవత్సర కాలంలోని రెండు యూనిట్లు పూర్తి చేయడమే కాక, ఈ డిసెంబర్ నాటికి తక్కిన యూనిట్లు పూర్తి చేసేందుకు ముందుకు వెళుతున్నట్లు తెలిపారు .విద్యుత్ యూనిట్ పనులు ఆలస్యం కావడం వల్ల ప్రజలపై పడే భారాన్ని తగ్గించాలని క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. విద్యుత్ ఉత్పదనతో పాటు, వైటిపిఎస్ లో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల ఏర్పాటు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఆస్పత్రి, అంబులెన్స్ సేవలు ఏర్పాటు చేస్తున్నామని, సిబ్బందికి క్వార్టర్స్ కట్టిస్తున్నామని, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. రహదారులు  దెబ్బ తినకుండా సిసి రోడ్డు పనులు మొదలు పెట్టడం జరిగిందని తెలిపారు. భూములు కోల్పోయిన వారికి గత ప్రభుత్వం పరిహారాన్ని గాలికి వదిలేస్తే తాము ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి ఉద్యోగాలు, పునరావాస కల్పన చేస్తున్నమని,  పులిచింతల కింద చిట్యాల మండలంలో నష్టపోయిన రైతులకు కూడా ఉద్యోగాలు ,పరిహారం అందజేస్తున్నట్లు వెల్లడించారు.
  
       శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ ,నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, హైడల్ డైరెక్టర్ బాలరాజు, కోల్ డైరెక్టర్ నాగయ్య, థర్మల్ డైరెక్టర్ వై. రాజశేఖర్ రెడ్డి ,జెన్కో సివిల్ డైరెక్టర్  అజయ్, జెన్కో హెచ్ఆర్ డైరెక్టర్ వి. కుమార్ రాజు తోపాటు, వైటీపీఎస్  పర్యవేక్షక ఇంజనీర్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

పద్బాంధవులుగా 108 సిబ్బంది. పద్బాంధవులుగా 108 సిబ్బంది.
లోకల్ గైడ్ (తాండూర్); దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు జిల్లావ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుంది.ప్రమాదం జరిగిన ఆపదలో ఉన్నవారికి సంజీవినిలా...
రైతులకు అవసరమైన అన్ని ఎరువులను అందుబాటులో ఉంచాలి
భేటీ బచావో ....! భేటీ పడావో ....!!
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని స్టేజ్ -1 లోని  800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటవ యూనిట్ ను  జాతికి అంకితం చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ,ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు.
విజయవంతమైన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
దేశుముఖ్ లను, భూస్వాములను తర్మిన మహావీరుడు కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి.
అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం