పఠాన్ చెరువు సర్కిల్‌లో పెండింగ్, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.

జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్‌ను కలిసిన డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు.

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి పఠాన్ చేరు  సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సురేష్‌ను సంగారెడ్డి జిల్లా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పఠాన్ చేరు సర్కిల్ పరిధిలో నెలకొన్న పలు ప్రజా సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై విస్తృతంగా చర్చించారు. ప్రధానంగా పారిశుధ్య లోపాలు, రోడ్ల దుస్థితి, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి కొరత వంటి అంశాలపై డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయా లు అందించడంలో జిహెచ్ఎంసి అధికారుల పాత్ర అత్యంత కీలకమని పర్స శ్యామ్ రావు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా సూచించారు. డిప్యూటీ కమిషనర్ సురేష్ స్పందిస్తూ, పఠాన్ చేరు సర్కిల్ పరిధిలోని సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, అభివృద్ధి పనులలో వేగం పెంచుతామని హామీ ఇచ్చారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు