ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ ఫణీంద్ర రెడ్డి.
By Ram Reddy
On
నారాయణపేట ఏప్రిల్ 13:
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీంద్ర రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టర్ సోమవారం ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను విన్నవిస్తూ అర్జీలను అదనపు కలెక్టర్ కు సమర్పించగా, ప్రజల ఫిర్యాదులను సమస్యలను సావధానంగా విన్న అదనపు కలెక్టర్ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా సోమవారం నాటి ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 48ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ.రామచందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:1.ఫిర్యాదులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్
-----------------------------------------
Tags:
About The Author
Latest News
22 Apr 2026 15:03:41
లోకల్ గైడ్: ఖమ్మం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ములకలపల్లి మండలంలోని కమలాపురం నుండి అన్నపరెడ్డిపల్లి మండలంలోని తొట్టి పంపు వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఉన్న...
