ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
By Ram Reddy
On
సిరిసిల్ల అంబేద్కర్ నగర్ అర్బన్ ఆరోగ్య వైద్య కేంద్రం ఆకస్మిక తనిఖీ
రాజన్న సిరిసిల్ల జిల్లా, లోకల్ గైడ్ తెలంగాణ:
ఎండాకాలం నేపథ్యంలో ఆసుపత్రికి వచ్చే జాగ్రత్తలు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ అర్బన్
ఆరోగ్య వైద్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ల్యాబ్, ఇన్ పేషెంట్ వార్డ్, వ్యాక్సిన్లు, ఓపీ రిజిస్టర్ పరిశీలించి.. సూచనలు చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు.
రోజు ఎంత మంది పేషెంట్లు వస్తున్నారో అని అడిగి తెలుసుకున్నారు. గర్బిణీల రిజిస్ట్రేషన్, టీకాలు, మందుల పంపిణీపై ఆరాతీశారు. పలువురు పేషెంట్లతో మాట్లాడి .. వారి అనారోగ్య సమస్యలను తెలుసుకున్నారు. .
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ఎండాకాలం నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు తెలియజేయాలని పేర్కొన్నారు. మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
పరిశీలనలో వైద్యురాలు రేణుక, సిబ్బంది తదితరులు ఉన్నారు.
Tags:
About The Author
Latest News
17 Apr 2026 20:26:09
నారాయణపేట ఏప్రిల్ 17:
కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
