వరి పంటలో పసుపు కాండం తొలిచే పురుగు నివారణ శిక్షణ...

రైతులకు రావెప్ విద్యార్థులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

వరి పంటలో పసుపు కాండం తొలిచే పురుగు నివారణ శిక్షణ...

బెల్లంపల్లి (లోకల్ గైడ్)

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని బుధా కుర్ధ్ గ్రామంలో వరి పంటలో పసుపు కాండం తొలిచే పురుగు దాడిని నివారించేందుకు రైతులకు రావెప్ విద్యార్థులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వరి నాటే సమయంలో మొక్కల ఆకుల చివరలను కత్తిరించే(లీఫ్ టిప్ క్లిప్పింగ్)విధానంపై రైతులకు ప్రాయోగిక శిక్షణ అందించారు.ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన జగిత్యాల వ్యవసాయ కళాశాల,జగిత్యాల విద్యార్థులు
ఎర్మల్ రాజేశ్వర్,గజ్జెల క్రిష్ణ హరి,ఘనశ్యామ్ బఘర్,హన్స్ రాజ్,ఖాత జయంత్ లు నిర్వహించారు.ఈ కార్యక్రమం బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పర్యవేక్షణలో జరిగింది.వరి మొలకల ఆకుల కొనలను నాటే ముందు కత్తిరించడం వల్ల పసుపు కాండం తొలిచే పురుగు( మోగి పురుగు)గుడ్లు,పురుగులు పొలంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చని విద్యార్థులు రైతులకు వివరించారు.ఈ విధానం వల్ల రసాయన పురుగుమందుల వినియోగం తగ్గి,ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉందని,భవిష్యత్తులో ఈ పద్ధతిని తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు.ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరిన్ని గ్రామాల్లో నిర్వహించాలని వారు కోరారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు