రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత.

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మిర్యాలగూడ వన్ టౌన్ ఏ ఎస్ ఐ శ్రీనివాస్

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత.

 మిర్యాలగూడ జనవరి 21
( లోకల్ గైడ్ తెలంగాణ)

వాహనాలను నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, మన అజాగ్రత్త మనకే కాక ఇతరులకు కూడా ప్రమాదాలను కలిగిస్తుందని, కనుక రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మిర్యాలగూడ వన్ టౌన్ ఏ ఎస్ ఐ శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అరైవ్  అలైవ్ రోడ్ సేఫ్టీ కాంపెయిన్ - లో భాగంగా డీ.జీ.పీ. బి. శివధర్ రెడ్డి, నల్గొండ ఎస్. పి. శరత్ పవార్   ఆదేశాల మేరకు
కె ఎన్ ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల  ప్రిన్సిపల్ మల్గిరెడ్డి భీమార్జున రెడ్డి అధ్యక్షతన ఎన్.ఎస్.ఎస్. యూనిట్ 1  2 ఆధ్వర్యంలో  రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు రోడ్డు భద్రత పట్ల అవగాహన పెంచుకొని ప్రమాదాల బారిన పడకుండా తమ ప్రాణాలను ఏ విధంగా కాపాడుకోవాలో  తెలియజేసారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల ద్వారా అనేకమంది  మృతి చెందుతున్నారు.  కనుక ప్రతిఒక్కరు ఈ  విషయాన్ని గమనించి  రోడ్డు భద్రతా చర్యలను పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని  అవగాహన కల్పించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ, లైసెన్స్ లేకుండా వాహనాలను నడపవద్దని తెలియజేసారు. ఈ  కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్  మాట్లాడుతూ మన అజాగ్రత్త వల్ల కుటుంబాలు వీధిన పడే అవకాశం ఉందని, నేటి యువత  అతి వేగంతో, బాధ్యతా రాహిత్యంతో  వాహనాలను నడిపి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, కనుక హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో  పోలీస్  సిబ్బంది బాష్యానాయక్, గోపమ్మ, హుస్సేన్, సైదులు కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు