అగ్నిప్రమాద బాధితులను ఆదుకుంటాం....

మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి.

అగ్నిప్రమాద బాధితులను ఆదుకుంటాం....

 

 

బెల్లంపల్లి (లోకల్ గైడ్)


మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ 23వ వార్డులో జరిగిన అగ్ని ప్రమాదం బాధితులను ఆదుకుంటామని బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్  దావ స్వాతి అన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదానికి గురైన గొడుగుల విజయలక్ష్మి అనే మహిళకు చెందిన ఇంటిని మున్సిపల్ కమిషనర్ రెడ్డితో కలిసి చైర్ పర్సన్ మంగళవారం పరిశీలించారు.అనంతరం ఆమె ఎమ్మెల్యేతో ఫోన్ లో మాట్లాడి స్థానికంగా నెలకొన్న పరిస్థితిని వివరించారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి త్వరితగతిన పంచనామా పూర్తి చేసి ప్రభుత్వం నుండి అందే నష్టపరిహారం బాధిత కుటుంబానికి త్వరగా అందేలా చూడాలని ఆదేశించారు.బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆయన తెలిపారు.చైర్ పర్సన్ వెంట కౌన్సిలర్ లు జంగం కల్పన,శ్రావణ్,కాంగ్రెస్ నాయకులు కంకటి శ్రీనివాస్,మున్సిపల్,రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!