సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)
ఏప్రిల్ 04:మంచు కొండల్లో సైతం సిద్దిపేట అన్నదాన సేవలు అమోఘంగా కొనసాగుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి హరీష్ రావు అన్నారు.శనివారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన యాత్ర కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. అలాగే కేదార్నాథ్కు పంపించనున్న ఆహార పదార్థాల వాహనాన్ని కూడా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మానవ సేవే మాధవ సేవ” అనే భావంతో కేదార్నాథ్కు వచ్చే భక్తులకు అన్నదానం చేయడం ఎంతో గొప్ప సేవ అని పేర్కొన్నారు. ఎముకలు కొరికే చలిలో కూడా సేవా కార్యక్రమాలను కొనసాగించడం ప్రశంసనీయమని అన్నారు.ఈ నెల 22వ తేదీ నుండి ప్రారంభమయ్యే కేదార్నాథ్ యాత్ర సందర్భంగా యాత్రికులకు అన్నప్రసాదం అందించేందుకు సిద్దిపేట అన్నదాన సేవా సమితి ఏర్పాట్లు చేసింది. కేదారేశ్వరుని సన్నిధిలో ఇది ఆరో సారి నిర్వహించనున్న అన్నదాన కార్యక్రమం కావడం విశేషం.ఈ సేవా కార్యక్రమం ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షిస్తూ, ఇందులో పాల్గొంటున్న అందరినీ ఆయన అభినందించారు.