ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం
మీరెన్ని కేసులు పెట్టినా న్యాయవ్యవస్థ ద్వారా ఎదుర్కొంటాం
న్యాయ వ్యవస్థ పై మాకు పూర్తి నమ్మకం ఉంది
ఆర్మూర్ (వెల్మల్ ),లోకల్ గైడ్ :
రాష్ట్రంలో అధికారం కొరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని బాల్కొండ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు . ఎన్ని కేసులు పెట్టిన కోర్టుల ద్వారానే పరిష్కరించుకొంటామని అన్నారు . న్యాయ వ్యవస్థ పై తమకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు .
ఇటీవల వేల్పూర్ సంఘటనలో బనాయించిన అక్రమ కేసుల్లో బెయిల్ మంజూరైన బిఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను మాజీ మంత్రి మంగళవారం పరామర్శించారు .ఇటీవల జరిగిన వేల్పూర్ సంఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమంగా హత్యాయత్నం కేసులు పెట్టినా హై కోర్టు ఈ కేసులన్నీ అక్రమం అని స్పష్టం చేస్తూ కార్యకర్తలందరికి బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు . ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అక్రమ కేసులు ఎదుర్కొని బెయిల్ మంజూరైన కార్యకర్తలను మహేష్, నితీష్,లాల,రహమాన్,గంగాధర్ గౌడ్ లను వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి మనోధైర్యం కల్పించారు,కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ..
నంగి దేవేందర్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు మహబూబ్ నగర్ ప్రాంత వాసి,అక్కడ నుండి వేల్పూర్లో నా ఇంటి లోపలికి వచ్చి దాడికి దిగాడని విమర్సించారు . దాడి చేయడానికి వచ్చిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా ఆ దాడిని అడ్డుకునే క్రమంలో జరిగిన చిన్న తోపులాటను కేంద్రంగా తీసుకుని పోలీసులు మా కార్యకర్తల మీదే అక్రమంగ హత్యయత్నం కేసులు పెట్టడం శోచనీయం అని పేర్కొన్నారు .
దీనిని ప్రజా పాలన అంటారా ? ప్రజల పక్షాన హామీల అమలు కోసం ప్రశ్నించిన వారిపై రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న కక్షసాధింపు చర్యలని స్పష్టమవుతోందని అన్నారు .
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసేంత వరకు – ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు .
మా కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, వాటిని మేము న్యాయవ్యవస్థలో ధైర్యంగా ఎదుర్కొంటాం, న్యాయస్థానాలపై మాకు పూర్తి నమ్మకం,విశ్వాసం ఉందని మాజీ మంత్రి స్పష్టం చేశారు . పోలీసులు ఇకనైనా రేవంత్ రెడ్డికి ,కాంగ్రెస్ పార్టీకి చుట్టంలా కాకుండా చట్టానికి లోబడి పని చేయాలని హితవు పలికారు . అధికార పార్టీకి తొత్తులుగా కాకుండా విధినిర్వహణ ప్రజలకు బాసటగా చేయాలనీ అన్నారు . లేకుంటే అటువంటి పోలీస్ లు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు .
About The Author
Related Posts
