రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆర్‌పి‌ఐ (అథవాలే) కార్యక్రమాలు

Published On
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆర్‌పి‌ఐ (అథవాలే) కార్యక్రమాలు


 *లోకల్ గైడ్:* 24/11/2025
హైదరాబాద్‌: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్ర కమిటీలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఈ నెల 26న మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, ఈనాడు కార్యాలయం ఎదుట, హైదరాబాద్‌లో జరుగనుంది. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించగా, అనంతరం 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా, 2015లో భారత ప్రభుత్వం నవంబర్ 26నను అధికారికంగా “రాజ్యాంగ దినోత్సవం”గా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమంలో పార్టీ బలోపేతం దిశగా భారీ ఎత్తున నూతన నాయకుల చేరిక, సభ్యత్వ నమోదు కార్యక్రమం, రానున్న గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులకు మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్ర కమిటీలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తప్పనిసరిగా హాజరవాలని పార్టీ పిలుపునిచ్చింది. మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానం ఇచ్చింది. కార్యక్రమం అనంతరం భోజన ఏర్పాట్లు ఉన్నట్లు తెలిపారు.

అలాగే, ఇదే రోజున ఉదయం 12 గంటలకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే)  మీటింగ్  సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరగనుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పేరం శివ నాగేశ్వర్‌రావు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగాన్ని భారత పార్లమెంటులో ప్రవేశపెట్టిన రోజు కావడంతో, ఈ సందర్భంగా  మీటింగ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఈ సమావేశంలో ఇటీవల పార్టీలో చేరిన ఫణి భూషణ్‌ను సన్మానించడం, జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించడం, డిసెంబర్ 1న ఢిల్లీలో జరగనున్న నేషనల్  మీటింగ్ ఏర్పాట్లు,  మరింత పటిష్ఠం చేయడానికి అవసరమైన చర్యలపై నాయకుల అభిప్రాయాలు, సూచనలు సేకరించనున్నట్టు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, కార్యకర్తలు ఉదయం 12 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు హాజరుకావాలని పేరం శివ నాగేశ్వర్‌రావు ఆహ్వానించారు.

Tags:

About The Author

Related Posts

Latest News

వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం
ఖమ్మం,ఆగస్టు,30: లోకల్ గైడ్:ఖమ్మం : వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మాజీ...
తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్లో నర్స్ దారుణ హత్య. 
మణికొండలో వాక్ విత్ హైడ్రా ర్యాలీ 
మిషనరీ చర్చి భూములను పరిరక్షించాలి.
శిరీష మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి
బోటనీ అధ్యాపకుడి కోసం దరఖాస్తుల ఆహ్వానం.
ప్రజలతో మమేకమైన పోలీసింగ్