హౌసింగ్ బోర్డు విద్యానగర్లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
భోగి మంటను ఆయన స్వయంగా వెలిగించి వేడుకలను ప్రారంభించారు.
By Ram Reddy
On
(లోకల్ గైడ్,తెలంగాణ)
తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సంబరాలు హౌసింగ్ బోర్డు విద్యానగర్ కాలనీలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం తెల్లవారుజామునే కాలనీ వాసులందరూ ఏకమై భోగి మంటలు వేసి పండుగను ఘనంగా జరుపుకున్నారు.
ఈ వేడుకలకు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి నాయకత్వం వహించారు. కాలనీ నడిబొడ్డున ఏర్పాటు చేసిన భోగి మంటను ఆయన స్వయంగా వెలిగించి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నూకల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మన సాంప్రదాయాలను గౌరవిస్తూ, కాలనీ వాసులందరూ ఒకే కుటుంబంలా కలిసి మెలిసి పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ భోగి మంటలు మన జీవితాల్లోని కష్టాలను తొలగించి, కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. కాలనీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి" అని పిలుపునిచ్చారు.
Tags:
About The Author
Latest News
15 Jan 2026 20:07:13
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
