గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళ, ఇద్దరు యువకుల అరెస్ట్...
1.4.కేజీ ల ఎండు గంజాయి స్వాధీనం...
*నిజామాబాద్ జిల్లా ప్రతినిధి:(లోకల్ గైడ్) గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళ, ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ స్వప్న తెలిపారు..నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లి, ఎల్లమ్మ గుట్ట తదితర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పలు ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసినట్టు ఎక్సైజ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ స్వప్న తెలిపారు.. షేక్ పర్వేజ్, కసిలేరు మాధవ్, నజియా బేగంలు పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తూ పట్టుబడినట్టు తెలిపారు..ముగ్గురి నుండి 1.4కేజీల ఎండు గంజాయితో పాటు రెండు బైక్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ దాడిలో ఎస్సైలు నరసింహాచారి, రామ్ కు మార్, హెడ్ కానిస్టేబుల్ రాజన్న, నారాయణరెడ్డి, కానిస్టేబుళ్లు భోజన్న, హమీద్, శివ సాయి, విష్ణు, అవినాష్, మంజుల పాల్గొన్నారు.
About The Author
Related Posts
