పోలీస్ స్టేషన్ లో గంజాయితో పట్టుబడ్డ మహ్మద్ జీషాన్ ఆత్మహత్యయత్నం...
By Ram Reddy
On
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి : (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ లో
యువకుడు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆరవ టౌన్ పరిధిలోని నాగారం ప్రాంతానికి
చెందిన మహ్మద్ జీషాన్ ను పోలీసులు గంజాయి విక్రయిస్తున్న కేసులో
సారంగపూర్ లో అదుపులోకి తీసుకున్నారు.. రిమాండ్ కు తరలించే సమయంలో పోలీస్ స్టేషన్ లోని బాత్ రూంలో
ఉన్న ఫినాయిల్ సేవించాడు.. గమనించిన పోలీసులు అతడిని ఎల్లమ్మగుట్టలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం చేయించి కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్లు తెలిసింది. జీషాన్ ఈ ఘటనకు పాల్పడడంపై పోలీస్ ఉన్నతాధికారులు ఆరాతీస్తున్నారు..ఏది ఏమైనా పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది...
Tags:
About The Author
Related Posts

Latest News
10 Jul 2025 20:44:56
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి : (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ లోయువకుడు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు..నిజామాబాద్ జిల్లా